ఏప్రిల్ 15 తేదీన ఇద్దరు యువకులు పీకల్దాకా తాగి కన్నూ మిన్నూ కానని మదాన్ని నిలువెల్లా నింపుకున్నారు. కాపు కాసి, చాక్లెట్ ఆశ చూపి అయిదేళ్ళ పాపను తమ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యంత పాశవిక రీతిలో అత్యాచారం చేశారు.
ఏప్రిల్ 17 తేదీన కూడా ఇలాగే మరో ఐదేళ్ల పాపను చాక్లెట్ ఆశ చూపి పిలిచి అత్యాచారం చేశాడొక మధ్య వయస్కుడు. పనయ్యాక పాపని పొలాల్లో పారేసిపోయాడు. ఆ పాప ఇప్పుడు పూనాలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నది.
ఏప్రిల్ 22 తేదీన ప్రకాశం జిల్లా పాకల గ్రామంలో తన ఇంటికి టి.వి చూడడానికి వచ్చిన ఐదేళ్ల పాప పైన అత్యాచారం జరిపాడు మరో త్రాష్టుడు. అతని వయసు దగ్గర దగ్గర 22 యేళ్ళు ఉండొచ్చని చెబుతున్నారు. పాకల పాప పరిస్ధితి కొంత మెరుగుగా ఉన్నప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఈ నేపధ్యంలో సందేశాత్మక కార్టూన్ల కోసం ప్రయత్నిస్తే సృజనాత్మ రీతిలో ప్రతిభావంతంగా రూపొందించిన ఈ కార్టూన్లు లభ్యమయ్యాయి. ఆలోచింపజేసేవిగా ఉన్న ఈ కార్టూన్లు వివిధ సంఘాల కార్యకర్తలకు ఉపయోగపడగలవు.
–
–














ee mrugalanu janam madhya samchariste atyanta pramadam. elanti vallaki enta pedda siksha vesina takkuve. politicians and police, jananiki manchi cheyalanukunte mada pichi patina mrugalanu public lo encounter cheyinchandi.