కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’ కేసులు నమోదు చేసింది. రష్యా కంపెనీ కోసం భారత ప్రభుత్వం సొంత ప్రజలను దేశ ద్రోహులుగా ముద్ర వేసి వేధింపులకు సిద్ధపడింది.
అణు కర్మాగారంతో భయపడుతున్న ప్రజలను పారామిలట్రీ బలగాలతో కవాతు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్తున్న పిల్లలను, పనులకు వెళ్తున్న మహిళలను నిత్యం తనిఖీలు జరుపుతూ వారి జీవనాన్ని దుర్భరంగా మార్చివేశారు. గ్రామాలను పోలీసు పోస్టులతో నింపేశారు. ప్రజల తరపున ఉద్యామిస్తున్న విద్యావంతులపై కేసులు పెట్టి ప్రజల తరపున పనిచేస్తే ఏమవుతుందో ప్రభుత్వాలు చెబుతున్నాయి. విదేశీ నిధులతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపించిన ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రులు ఒక్క ఆధారమూ చూపలేదు. సంబంధిత కేసులు పెట్టలేదు. అబద్ధ ఆరోపణలను మాత్రం కొనసాగిస్తున్నారు.
కూడంకుళం అణు కర్మాగార వ్యతిరేక పోరాటం అచ్చమైన ప్రజల పోరాటం. ఆ విషయం ‘ది హిందూ’ పత్రిక అందించిన ఈ ఫోటోలు చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. సంవత్సర కాలంగా జరుపుగున్న ఈ పోరాతం ఎంత శాంతియుతంగా జరుగుతూ వచ్చిందో కూడా ఈ ఫోటోలు సూచిస్తాయి. ప్రజల మొరవినకుండా అణు ఇంధనం నింపడానికే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించాక ప్రజలు ఏంచేయాలి? ఇంతకాలంగా నిరసన తెలుపుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోతు మీద వర్షంలా వ్యవహరిస్తే ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి. కంచే చేను మేస్తుంటే ప్రజలను కాపాడేదెవరు? మొర పెట్టుకుని, పెట్టుకునీ విసిగిపోయేలా చేసి ప్రజలను రెచ్చగొట్టాక ఇప్పుడు హింసాత్మకంగా ఆందోళన మారిందని ప్రభుత్వాలు నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నాయి. పోలీసులను పురమాయించి చోద్యం చూస్తున్నాయి.
- కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం
- ఆగస్టు 15, 2011 న కూడంకుళంలో జరిగిన గ్రామ సభ. అణు కర్మాగారం వెంటనే మూసివేయాలని ప్రజలు ఇందులో కోరుతూ తీర్మానం ఆమోదించారు. రాజ్యాంగం అనుమతించిన ప్రజాస్వామిక హక్కుని వినియోగించుకున్నారు.
- ఆగస్టు 16, 2011 న ఇదింతకరై గ్రామంలో సామూహిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
- సెప్టెంబరు 21, 2011 న ట్యుటికోరిన్ లో మహిళలు నిరసన తెలిపి అణు కర్మాగారం మూసివేయాలని కోరారు.
- అణు కర్మాగారం ట్యుటికోరిన్ మత్స్యకారుల నిరసన
- ఆందోళనకు మద్దతుగా స్కూళ్లను బహిష్కరించిన విద్యార్ధులు
- అణు కర్మాగారంలో పని చేయడానికి ఉత్తర రాష్ట్రాలనుండి వచ్చిన కార్మికులు. ఇళ్ళను ఖాళీ చేయించడంతో వెనక్కి వెళ్తున్నారు. (అక్టోబరు 15)
- నవంబరు 4, 2011 న ట్యుటికోరిన్ వాసుల నిరసన
- రష్యా కంపెనీలకు మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త వకాల్తా
- డిసెంబర్ 18, 2011. కూడంకుళం నుండి రాధాపురం వరకూ బీచ్ రోడ్ లో క్రిక్కిరిసిన నిరసన
- ఫిబ్రవరి 9, 2012. విజయబాతి లో నల్ల బ్యాడ్జిలతో నిరసన
- ఫిబ్రవరి 11, 2012 న పలయం కొట్టైలొ నిరసన ప్రదర్శన
- మార్చి 23, 2012: కూడంకుళం ప్రజలకు మద్దతుగా న్యూఢిల్లీ జంతర్ మంతర్ లో మేధా పాట్కర్ నిరసన
- కూడంకుళం పోరాట కమిటీ నాయకుడు ఎస్.పి.ఉదయ్ కుమార్ నిరాహార దీక్ష (మార్చి 23, 2012)
- సెప్టెంబర్ 10, 2012: ట్యుటికోరిన్ మత్స్యకారుల రైల్ రోకో
- సెప్టెంబర్ 10, 2012: తిరునల్వెలి లో ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసుల లాఠీచార్జి
- సెప్టెంబర్ 10, 2012: ట్యుటికోరిన్ లో మత్స్యకారుల రైల్ రోకో
- జల సత్యాగ్రహం చేస్తున్న మత్స్యకారులను చుట్టుముట్టేందుకు పోలీసుల ప్రయత్నం
- చెన్నైలో బస్సులపై రాళ్లు


















