బ్రిటిష్ ఇండియా కాలం నాటి కలకత్తాలో ప్రజా జీవనాన్ని తెలిపే ఫొటోలివి. అరుదయిన గ్లాస్ ప్లేట్ నెగిటివ్ లు లండన్ లోని ఒక మ్యూజియం ఆర్కైవ్స్ లో ఇవి లభ్యం అయ్యాయి. RCHAMS (Royal Commission on the Ancient and Historical Monuments of Scotland) వెబ్ సైట్ ఈ ఫొటోలను ప్రచురించింది.
ఇవి 1912 నాటి ఫొటోలని తెలుస్తోంది. స్టేట్స్ మెన్ పత్రిక కాపీలతో చుట్టి ఉన్న 178 గ్లాస్ ప్లేట్ నెగిటివ్ ల ప్యాకేజి లో వీటిని కనుగొన్నారట. 1875 లో స్ధాపించబడిన ‘స్టేట్స్ మెన్’ పత్రిక ఇండియాలో అప్పట్లో అతి పెద్ద సర్క్యులేషన్ కలిగిన పత్రిక. ఇప్పటికీ అది ప్రచురితం అవుతోంది.
కింగ్ జార్జి V, క్వీన్ మేరీ 1912 లో కలకత్తా సందర్శించినప్పటి సెలబ్రేషన్స్ ఈ ఫొటోల్లో ఉన్నాయి. ఇండియా బ్రిటిష్ పాలనలో ఉండగా బ్రిటిష్ రాణి , రాజు ఇండియా సందర్శించడం అదే మొదటిది, చివరిదీ అని వెబ్ సైట్ తెలిపింది. హుగ్లీ నది ద్వారా కలకత్తా సందర్శించె వారు చేరుకునే చాంద్ పాల్ ఘాట్ దృశ్యాలు, మతపరమైన పండగ కోసం మైదాన్ లో చేరిన యాత్రికుల దృశ్యాలు, కలకత్తా లో అతి పెద్ద దైన అర్బన్ పార్క్, ఒరిస్సాలోని జగన్నాధ్ దేవాలయం ముందు వ్యాపారులు తమ సరుకులు అమ్ముకుంటున్న దృశ్యాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి.
–



























