భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ గా ప్రసిద్ధికెక్కిన ‘హోమై వ్యారవల్లా’ జనవరి 15 తేదీన మరణించింది. మరణించేనాటికి ఆమెకు తొంభై ఎనిమిదేళ్ళు. స్వతంత్ర భారత దేశం జన్మించినప్పటినుండీ పత్రికా ఫొటోగ్రాఫర్ గా ముప్ఫై మూడేళ్ల పాటు ఈమె తన వృత్తిని కొనసాగించారు. బ్రిటిష్ ఇండియా అంతం, స్వతంత్ర ఇండియా ప్రారంభానికి సంబంధించి ఈమె తీసిన ఫొటోలు ఇప్పటికీ చారిత్రాత్మకంగా మన్ననలు అందుకుంటున్నాయి. 1913 లో గుజరాత్ లోని నవసారి లో ఓ మధ్య తరగతి పార్శీ కుటుంబంలో జన్మించిన హోమై పత్రికా ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించడం పెద్ద సాహసంగానే చెప్పుకోవచ్చు. గుజరాత్ లో జన్మించినప్పటికీ ఈమె పెరిగింది ముంబై లోనే. తన క్లాసులో మెట్రిక్యులేషన్ లో పాస్ అయిన ఏకైక అమ్మాయి ‘హోమై’ యేనట. తాను ఫొటోగ్రఫీ నేర్చుకున్న గురువు ‘మానెక్షా వ్యారవల్లా’ నే ఆమె ఆ తర్వాత పెళ్లాడారు.
భారత ప్రభుత్వాలు నెహ్రూవియన్ విధానాలను తుంగలో తొక్కడం ప్రారంభం అయ్యాక ఆమె 1990 లో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ని ముగించి వదోదర లో శేష జీవితం గడిపినట్లు తెలుస్తోంది. పరివర్తనలో దశలో ఉన్న భారత దేశాన్ని ఈమె తన ఫోటోల్లో బంధించింది. ఆ ఫోటోల్లో కొన్నింటిని ‘యాహూ ఇండియా’ వార్తల సెక్షన్ ప్రచురించింది.
- 1955లో హోమై కొన్న కారు డాల్డా (నిక్ నేమ్). 13 తారీఖున పదకొండువేలకు ఈ కారు కొన్నదిట. ఎవరూ ఇష్టపడని 13 ఈమె లక్కీ నంబర్ ట.
- ఓ చిల్డ్రన్స్ డే నాడు తీసిన ఫొటో. పేద పిల్లలను ఇలా నెహ్రూ అక్కున చేర్చుకోగా హోమై ఎన్నడూ చూడలేదట! అందుకు బాధ్యత నెహ్రూ చుట్టూ ఉన్న కోటరీదేనని హోమై అభిప్రాయం.
- 2 జూన్ 1947 తేదీన ఎ.ఐ.సి.సి సమావేశం ఇది. దేశ విభజనపైన జరిగిన ఓటింగ్ లో సభ్యులు పాల్గొంటున్నారు.
- బిర్లా హౌస్ లో ‘మహాత్మగాంధీ’ పార్ధివ దేహం. పటేల్, నెహ్రూ, మౌంట్ బాటన్, బల్దేవ్ సింగ్, రామ్ దాస్ (గాంధీ పుత్రుడు) ఈ ఫొటోలో ఉన్నారు.
- ప్రధమ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక సంప్రదాయం ప్రకారం ‘విజయ్ చౌక్’ గుండా డా. రాజేంద్ర ప్రసాద్ సవారీ చేసిన దృశ్యం.
- 26 జనవరి 1950 న మొదటి రిపబ్లిక్ డే పెరేడ్. అప్పట్లో ఇది పురానా ఖిల్లా. ఇప్పుడిది నెషనల్ స్టేడియం. తర్వాత నుండి పెరేడ్ ని ఇండియా గేట్ కి మార్చారు. రాష్ట్రపతి చుట్టూ రక్షణ ఏమీ లేకపోవడం ఈ ఫొటోలోని ముఖ్య సంగతి.
- 1948 లో రాజగోపాలాచారి ‘గవర్నర్ జనరల్’ అయ్యాక నెహ్రూ కేబినెట్ కి పటేల్ ఇచ్చిన విందు దృశ్యం. రఫీ అహ్మద్ కిద్వాయ్, బల్దేవ్, మౌలానా, నెహ్రూ, రాజగోపాలాచారి, పటేల్, రాజ్ కుమారి అమృత్ కౌర్, జాన్ మత్తయ్య, జగ్జీవన్, గాడ్గిల్, నియోగి, అంబేద్కర్, శ్యాం ప్రసాద్, గోపాల్ స్వామి, జయరాందాస్ ఈ ఫొటోలో ఉన్నారు (ట).
- నెహ్రూ మరణానంతరం సంస్మరణ సభలో మొదటి ముగ్గురు రాష్ట్రపతులు
- 1956లో దలైలామా సిక్కిం గుండా మొదటిసారి ఇండియాలోకి ప్రవేశిస్తున్న దృశ్యం. ఆయన వెనుక ఉన్నది పంచన్ లామా
- ఎయిర్ పోర్టు లో ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ. హోమై తన జుట్టు కత్తిరించినపుడు ఇందిరా అభినందించిందట. కొన్ని నెలలకి ఇందిరా కూడా తన జుట్టు కత్తిరించుకుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించడంతోటే కొత్త దేశ నిర్మాణంపై హోమై కి భ్రమలు పోయాయట.
- తన వృత్తిలో ఎప్పుడూ ఖద్దరు చీరలే హోమీ ధరించేది. ఫంక్షన్లకు శిల్క్ చీరలు ధరించేది. చీరకట్టు తన వృత్తికి బాగా ఇబ్బంది కలిగించేదనీ ఎప్పుడూ పిన్నీసుల్ని తన వద్ద స్టాక్ ఉంచుకునేదాన్ననీ హోమై చెప్పింది.
–
–













ఆవిడ ఫొటోలూ, ఆవిడ తీసిన ఫొటోలూ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి.
అసలు ఇందిరా గాంధీ ఫొటో అద్భుతం!
ప్రెస్ ఫొటో గ్రాఫర్….ఆ రోజుల్లో! చాలా గర్వంగా ఉంది ఈమెను చూస్తుంటే