పశ్చిమ బెంగాల్, సంగ్రామ్ పూర్ గ్రామంలో విషపూరితమైన చీప్ లిక్కర్ తాగి మృతి చెందినవారి సంఖ్య 167 కి పెరిగింది. మృతులందరూ రిక్షా కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, రోజు కూలీలే. వీరి మరణంతో వీరి సంపాదనపై ఆధారపడి ఉన్న కుటుంబాలు భవిష్యత్ ఎలా అని తల్లడిల్లుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ధనిక రోగులు చేరే ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం, కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల నష్ట పరిహారం ప్రకటించాయి. లిక్కర్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు నష్టపరిహారం ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం అది కూడా ప్రకటించినట్లు లేదు. మమత ప్రభుత్వం కురిపించే మమత ధనికులకే పరిమితమా?
–
“ఫొటోలు: ది హిందూ”
–










