2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి బుధవారం అనుకోని పరిణామం సంభవించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓ లు ఐదుగురికి బుధవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో జైలులోనే ఉన్న మిగిలిన వారికి కూడా బెయిల్ ఆశలు పుడతాయని చెప్పవచ్చు. ఈ కేసులో హై ప్రొఫైల్ ముద్దాయిలయిన ఎ.రాజా, కనిమొళిలకు కూడా దొరకని బెయిల్ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓలకు దొరికింది. వీరు కాక జైలులో ఇంకా తొమ్మిది మంది ఉన్నారు.
–
