పాక్ ద్వేషులకు దుర్వార్త, భారత్ పాక్‌లు వాణిజ్య బంధం పటిష్టం చేసుకుంటున్నాయి

ఇది మన పొరుగు దేశం పాకిస్ధాన్‌ను అకారణంగా ద్వేషించేవారికి నిజంగా దుర్వార్తే. భారత్, పాకిస్ధాన్ దేశాలు తమ మధ్య వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లయితే అటువంటి చర్యలు ఇరు దేశాలు భవిష్యత్తులో మరింత సమీప సంబంధాలను అభివృద్ధి కావడానికి దోహదపడతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి. పాకిస్ధాన్ వాణిజ్య మంత్రి ‘మక్దూమ్ అమిన్ ఫాహిమ్’ ప్రస్తుతం ఆరు రోజుల ఇండియా పర్యటనలో ఉన్నాడు.…

తప్పుడు ప్రచారం చేసినందుకు ‘రీబాక్’ బూట్ల కంపెనీపై $25 మిలియన్ వడ్డన

ఇది అమెరికాలో సంగతి. తమ బూట్లు ధరించి వ్యాయామం చేసినట్లయితే ఇతర బూట్లు ధరించినవారి కంటే వేగంగా ఫిట్‌నెస్ సాధిస్తారని ‘రీబాక్’ బూట్ల కంపెనీ ప్రచారం చేసినందుకుగాను అమెరికా ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ దానిపైన 25 మిలియన్ డాలర్ల పెనాల్టీని వడ్డించింది. రీబాక్ కంపెనీ, ఫెడరల్ ట్రెడ్ కమిషన్ (ఎఫ్.టి.సి) లు పరస్పర అంగీకారం మేరకు ఈ వడ్డన అమలు చేస్తారు. వినియోగదారులకు చేసే చెల్లింపులకు దీనిని ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఎఫ్.టి.సి, రీబాక్ కంపెనీ ప్రచారంపైన…

పుతిన్ చేతిలో మెడ్వెడెవ్, మెడ్వెడెవ్ చేతిలో పుతిన్ -కార్టూన్

ప్రస్తుత రష్యా అధ్యక్షుడు మెడ్వెడెవ్ తన అనంతరం పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నాడని అధికారికంగా ప్రకటించేశాడు. మెడ్వెడెవ్ అధ్యక్షుడు కాక ముందు పుతిన రష్యా అధ్యక్షుడుగా రెండు సార్లు పనిచేశాడు. వరుసగా మూడో సంవత్సరం కూడా అధ్యక్షుడుగా పని చేసే అవకాశం రష్యా రాజ్యాంగం ఇవ్వదు. అందువలన తన కీలు బొమ్మగా అధ్యక్ష స్ధానానికి తన అనుచరుడు మెడ్వెడెవ్ ను అధ్యక్షుడిగా చేసి తాను ప్రధానిగా పుతిన్ పని చేశాడు. ఇప్పుడు మెడ్వెడెవ్ పదవీకాలం…

మూడు సంవత్సరాల్లో అత్యధిక షేర్ నష్టాలను చవిచూసిన రెండో క్వార్టర్

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని రెండవ క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబరు 2011) గత మూడు సంవత్సరాలలోనే అత్యధికంగా నష్టాలను చవిచూసిన క్వార్టర్ గా రికార్డయ్యింది. 2008 లో సెప్టెంబర్ లో లేమేన్ బ్రదర్స్ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించాక అక్టోబర్, నవంబరు డిసెంబరు నెలలతో కూడిన క్వార్టర్ అత్యధిక స్ధాయిలో సెన్సెక్స్ 25 శాతం నష్టపోయింది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు జులై, ఆగస్టు, సెప్టెంబరు (2011) లతో కూడిన క్వార్టర్ లో సెన్సెక్స్ 12.8 శాతం…

ఇండియా అణుపరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు -అమెరికా

గత సంవత్సరం భారత పార్లమెంటు ఆమోదించిన “అణు ప్రమాద నష్టపరిహార చట్టం” అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అమెరికా పెదవి విరిచింది. అంతర్జాతీయ ప్రమాణంగా చెబుతున్న “కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్” (సి.ఎస్.సి) కు అనుగుణంగా భారత చట్టం లేదనీ, ఈ విషయంలో ఇండియా తన నిర్ణయాలను స్పష్టం చేయడానికి ఐ.ఎ.ఇ.ఎ ను వేదికగా ఎంచుకోవాలని అమెరికా హిత బోధ చేసింది. మూడేళ్ళ క్రితం అమెరికా భారత్ ల మధ్య “పౌర అణు ఒప్పందం” కుదిరింది. ఇందిరాగాంధి…

కనుమరుగవుతున్న డాలర్ ఆధిపత్యం -కార్టూన్

ఇన్నాళ్లూ ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకున్న డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. రెండు దురాక్రమణ యుద్ధాలు, వాటి కారణంగా వేగంగా సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లు డాలర్ బలాన్ని నేలమట్టం చేస్తున్నాయి. ఏ ‘ఎదురులేని ప్రపంచాధిపత్యం’ కోసమైతే అమెరికా దురాక్రమణ యుద్ధాలకు తెగబడిందో అదే ఆధిపత్యాన్ని అమెరికా ఇప్పుడు కోల్పోతున్నది. సంక్షోభంలో బడా కంపెనీలకు ట్రిలియన్ల డాలర్ల బెయిలౌట్లు మంజూరు చేసి కొండంత అప్పును అమెరికా మూటగట్టుకుంది. ఆ అప్పుల భారాన్ని ఇప్పుడు…

జూనియర్ అధికారిదే పాపం అంతా, ప్రణబ్ నోట్ పై చేతులు దులుపుకున్న మంత్రివర్యులు

“2జి కుంభకోణ చోటు చేసుకున్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన పి.చిదంబరం, స్పెక్ట్రంను వేలం వేయడమే సరైందన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే కుంభకోణం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు” అంటూ ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక శాఖలోని డెప్యుటీ సెక్రటరీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన నోట్ లో పేర్కొన్న సంగతి ప్రణబ్ ముఖర్జీ తనకు సంబంధం లేదనీ, అంతా ఆ జూనియర్ అధికారి చేసిందే నంటూ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.…

తెలంగాణ సకలజనుల సమ్మె, 17వ రోజు మంత్రుల ఇళ్ల నిర్బంధం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అప్రహతిహతంగా కొనసాగుతోంది. భారత దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా, ఒక్క నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం తప్ప, సమాజంలోని దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి ఉద్యమించడమే కాక సమ్మెలు చేస్తున్నవారంతా రోడ్లపైకి వచ్చి నినదిస్తూ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల రూపాల్లో సమ్మెలో పాల్గొంటూ కనీ వినీ ఎరుగని సంయమనంతో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుత ఉద్యమమే…

పాకిస్ధాన్‌పై దాడులు విస్తృతం చేస్తాం -అమెరికా

పాకిస్ధాన్ ప్రాంతాలపై ఒక్క డ్రోన్ దాడులే కాకుండా మరిన్ని విస్తృత పద్ధతుల్లో దాడులు చేస్తామని అమెరికాకి చెందిన రిపబ్లికన్ సెనెటర్ ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. సీనియర్ సెనెటర్ అయిన లిండ్సే గ్రాహం, పాకిస్ధాన్‌లో అమెరికా మిలట్రీ చర్యలను విస్తృతపరచాలన్న అంశంపై అమెరికా విధాన కర్తలలో ఏకీభావం అంతకంతకూ పెరుగుతోందని ఆ సంస్ధ తెలిపింది. డ్రోన్ దాడులు ఇప్పటికే మిలిటెంట్లను టార్గెట్ చేస్తున్నాయని వాటితో పాటు బాంబర్లను కూడా వినియోగించే అవకాశం ఉందని గ్రాహం ఉప్పందించాడు. “అమెరికా…

కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం, మరిన్ని సెటిల్‌మెంట్ల నిర్మాణానికి ఆమోదం

ఓవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా దేశ ప్రకటనపై తీవ్రమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంలో ఇజ్రాయెల్ దేశస్ధులకు కొత్త సెటిల్‌మెంట్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజాన్ని పరిహసించడం ఇజ్రాయెల్ కు ఇది కొత్త కాదు. ఐక్యరాజ్య సమితితో ఇజ్రాయెల్ వ్యవహారం అంతా మొదటినుండీ జాత్యహంకార పద్ధతుల్లోనే ఉంటూ వచ్చింది. 1967 యుద్ధంలో పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంపై ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు నిర్మించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెరికా నుండి శ్రీలంక…

తీహార్ జైలు కాదు, త్రీ స్టార్ జైలు -కార్టూన్

2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సి.బి.ఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే ప్రధాని మన్మోహన్ పాత్ర కూడా వెల్లడవుతుంది. వీరంతా వి.వి.ఐ.పిలు. దేశాన్ని పాలిస్తున్నవారు. సుప్రీం కోర్టు చురుకుగా ఉన్నందున ఈ వి.వి.ఐ.పిలు వాస్తవానికి వి.వి.ఐ.పి లు కాదనీ…

పట్టేవాడుంటే యు.పి.ఎ అవినీతి పుట్టలో బోలెడు అవినీతి “నోట్”లు

మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ప్రధాని మన్మోహన్ లు కూడా తెలిసీ 2జి కుంభకోణాన్ని అడ్డుకోలేదని వెల్లడయ్యింది. ఎ.రాజా, దయానిధి మారన్ లు అడ్డంగా అవినీతికి పాల్పడుతుంటే, అడ్డుకుని దేశ సంపదను కాపాడవలసింది పోయి,…

రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ

కోట్లాది డాలర్ల విలువ గల భారత రిటైల్ రంగాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపడానికి భారత ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆర్.పి.సింగ్ హామీ ఇచ్చాడు. 450 బిలియన్ డాలర్ల (రు. 20 లక్షల కోట్లు) విలువ గల భారత రిటైల్ రంగం వాల్ మార్ట్ లాంటి ప్రపంచ స్ధాయి కంపెనీలకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం చాలా కాలంగా హామీ ఇస్తున్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు,…

అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ…

అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికా…