అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల ప్రాపకంతో లిబియాలో కొనసాగుతున్న తిరుగుబాటుదారుల్లో ఐకమత్యం వెల్లివిరుస్తున్నట్లు అక్కడి నుండి వస్తన్న వార్తలు తెలుపుతున్నాయి. యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో పాల్గొంటున్న కమేండర్ను వెనక్కి పిలిపించి మరీ కాల్చి చంపేటంత ఐకమత్యం వారిలో అభివృద్ధి చెందింది. జనరల్ అబ్దెల్ ఫతా యోనెస్, తిరుగుబాటు ప్రారంభంలొ గడ్డాఫీని వదిలి తిరుగుబాటు శిబిరంలోకి మారాడు. ఆయన రహస్యంగా గడ్డాఫీ బలగాలకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో లిబియా తిరుగుబాటుదారుల్లోని ఒక సెక్షన్, ఆగస్ఠు ప్రారంభంలో ఆయనని కాల్చి చంపింది. ఆ ఘటనకు తిరుగుబాటు ప్రభుత్వం ఇంకా వివరణ ఇవ్వడంతో శక్తివంతమైన ఆయన తెగవారు న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకోవలసి ఉంటుందని యోనెస్ కుటుంబం హెచ్చరించింది. ఆల్-ఖైదా గ్రూపు ఈ హత్య వెనుక ఉందని లిబియా ప్రభుత్వం చెబుతోంది. యోనెస్ హత్యతొ లిబియా తిరుగుబాటుదారుల విశ్వసనీయతపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులకు అనుమానాలు తలెత్తాయి. తిరుగుబాటుదారుల్లో తలెత్తిన లుకలుకలు క్రింది వార్తల్లో చదవవచ్చు.
- “Libyan Rebels Accused of Pillage and Beatings” (న్యూయార్క్ టైమ్స్, 12 జులై 2011) -సి.జె.ఛివర్స్
- “Libyan Rebels Have Conceded Ground since Bombing Began” (ఇండిపెండెంట్, 27 జులై 2011) -కిమ్ సేన్ గుప్తా
- “Death of Rebel Leader Stirs Fears of Tribal Conflict” (న్యూయార్క్ టైమ్స్, 28 జులై 2011) -డేవిడ్ డి.కిర్క్పాట్రిక్
- “Benghazi Clash Exposes Cracks in Rebel Ranks” (New York Times, 31 జులై 2011) -డేవిడ్ డి.కిర్క్పాట్రిక్
- “Why the West Is Committed to the Murderous Rebels in Libya” (ఇండిపెండెంట్, 31 జులై 2011) -పేట్రిక్ కాక్బర్న్
- “Too Many Cooks Spoil Libya’s Rebel Front” (రాయిటర్స్, 4 ఆగష్టు 2011) -రానియా ఎల్ గమాల్
కార్టూనిస్టు: విక్టర్ నీటొ, వెనిజులా, Rebelion
