కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతిపై కాగ్ నివేదిక ఢిల్లీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై కూడా ఆరోపణలు చేసింది. సరిగా దర్యాప్తు చేయడం లేదని ఢిల్లీ హై కోర్టు మరోవైపు ఢిల్లీ పోలీసులను చెండాడుతోంది. అసలు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధిపతిగా సురేష్ కల్మాడిని నియమించింది ఎన్.డి.ఏ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ చల్లగా చెప్పడంతో బి.జె.పి పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అప్పటికే సురేష్ కల్మాడిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఎన్.డి.ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ (యు.పి.ఎ) ప్రభుత్వం చెబుతోంది. కామల్ వెల్స్ గేమ్స్ లో జరిగిన అవినీతికి ఏ పార్టీ మినాయింపు కాదని కాగ్, ఢిల్లీ హైకోర్టుల ద్వారా స్పష్టమైంది. అందుకే, “ప్రతిపక్షాలు కుంభకోణాల విషయంలో తక్కువేమీ తినలేదు, మాకేం భయం?” అని పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించాడు”
కామన్ వెల్త్ గేమ్స్లో అన్నీ రాజకీయ నాయకులు అన్నీ తామే అయి వ్యవరించారని చెప్పే ఈ కార్టూన్ “ది హిందూ” ప్రచురించింది. కార్టూనిస్టు: కేశవ్
“కామన్ వెల్త్ గేమ్స్” కావివి “కరప్షన్ వెల్త్ గేమ్స్”
