అమెరికా, నెంబర్ 1 ఇంటర్నెట్ స్వేచ్చా హంతకి

స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం లపై ప్రపంచానికి సుద్దులు చెప్పే అమెరికా స్వయంగా ఇంటర్ నెట్ స్వేచ్చని హరిస్తోందని ఫారెన్ పాలసీ (ఎఫ్.పి) పత్రిక ప్రకటించింది. చైనా, ఇరాన్, సిరియా, ఈజిప్టు, ట్యునీషియా, లిబియా మున్నగు దేశాలలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు పరస్పరం సంప్రదించుకోకుండా ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్య ఆకాంక్షలను హరించివేశారని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ప్రభుత్వమే అమెరికా ప్రజల ప్రజాస్వామిక స్వేచ్చని హరిస్తోందని ఎఫ్.పి సంచలనాత్మక కధనం ప్రచురించింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను హరిస్తున్నట్లు తాను ఎవరినైతే ఆడిపోసుకుంటున్నదో…

ఫేస్ బుక్, గూగుల్ తదితర ఐ.టి సంస్ధలపై ఫిర్యాదులు స్వీకరించిన భారత కోర్టులు

అభ్యంతరకర సమాచారాన్ని తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన భారత కోర్టులు అమెరికాకి చెందిన ఐ.టి సంస్ధలకు నోటీసులు జారీ చేసింది. ఫేస్ బుక్, యాహూ, గూగుల్ లాంటి పందొమ్మిది ఐ.టి సంస్ధలు కోర్టునుండి నోటీసులు అందుకున్న సంస్ధల జాబితాలో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన రెండు కోర్టులు మతపరంగా ప్రజలను గాయపరిచేవిగా ఉన్న సమాచారాన్ని వెంటనే తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీలోని ఒక కోర్టు,…

ఇంటర్నెట్ సామాజిక వెబ్ సైట్లు స్వీయ నియంత్రణ పాటించాలి -కేంద్ర మంత్రి

గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి ఇంటర్నెట్ సంస్ధలు, సామాజిక వెబ్ సైట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే అంశాల వల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర సమాచార, ఐ.టి శాఖ మంత్రి కబిల్ సిబాల్ మంగళవారం కోరాడు. అనేక సంస్కృతులు, మతాలు ఉన్న భారత దేశంలో ఏ ఒక్కరి మనోభావాలు గాయపడకుండా ఇంటర్నెట్ సంస్ధలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరాడు. మంత్రి ప్రకటనకు ఇంటర్నెట్ సంస్ధలు వివిధ రకాలుగా స్పందించాయి.…