ఋతుపవన వర్షాలపైనే ప్రధానంగా ఆధారపడ్డ భారతదేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్

భారత దేశ మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ పండితులు ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్ అహ్లూవాలియా (ఈయన రేప్ ప్రయత్నం నేరానికి అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ ఎం.డి స్ట్రాస్ కాన్ స్ధానంలో నియమితులయ్యే అవకాశం ఉన్నవారిలో ఒకటిగా పరిగణింపబడుతున్నాడు. యూరప్ ఒప్పుకోదనుకోండి!), ప్రధానికి ఆర్ధిక సలహాదారుల ముఠాకి నాయకుడైన కౌశిక బసు లు (హోం మంత్రి చిదంబరంను కూడా వీళ్ళలో కలపవచ్చు. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నెహ్రూవియన్ ఆర్ధిక విధానాలని కొంతవరకు ఇంకా అంటిపెట్టుకుని ఉన్నందున…

బ్రెజిల్ నుండి ఐ‌ఎం‌ఎఫ్ గెంటివేత!

ఐ‌ఎం‌ఎఫ్ ని బ్రెజిల్ గెంటివేసింది. మీ సేవలు చాలు, దేశాన్ని విడిచి వెళ్ళండి అని మొఖం మీదే చెప్పింది. బ్రెజిల్ ఆర్ధిక మంత్రి స్వయంగా ‘ఇక చాలు, మూటా ముల్లె సర్దుకోండి’ అని చెప్పేశాడు. దానితో బ్రెజిల్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తామని బ్రెజిల్ ప్రకటించింది. ఐ‌ఎం‌ఎఫ్ సంస్ధ ప్రపంచ కాబూలీవాలా. ఆర్ధిక కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పుకుంటుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సంక్షోభ నివారణ ఔషధాలు అందజేసి కోమా ఉన్న ఆర్ధిక వ్యవస్ధలను…

అత్యంత ధనిక దేశంగా అమెరికాను వెనక్కి నెట్టిన చైనా!

ప్రధాన ఆర్ధిక శక్తిగా అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా అవతరించింది. వార్షిక జి‌డి‌పి రీత్యా అమెరికా ఇప్పటికీ మొదటి స్ధానంలో ఉన్నప్పటికీ సంపదల సృష్టిలో మాత్రం చైనా అమెరికాను మించిపోయింది. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చైనాలో సంపదలు విపరీతంగా పెరిగాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో సంపదలు మూడు రెట్లు పెరిగాయని ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే అండ్ కో తెలిపింది. అత్యంత సంపన్న దేశాలలో టాప్ 10…

ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు. జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న…

నెమ్మదిగా పురోగమిస్తున్న బ్రిక్స్ బ్యాంక్

సెప్టెంబర్ 9, 2021 తేదీన భారత దేశం నేతృత్వంలో (Chairship) 13వ బ్రిక్స్ సమావేశాలు ఆన్-లైన్ పద్ధతిలో జరిగాయి. మిగతా నాలుగు దేశాల నేతలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. “బ్రిక్స్ సభ్య దేశాల అంతర్గత సహకారం కొనసాగింపు, స్ధిరీకరణ, ఏకాభిప్రాయం” అనే అంశం కేంద్రంగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం నాటికి బ్రిక్స్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవడం విశేషం. మూడు మూల స్తంభాల ప్రాతిపదికన బ్రిక్స్ దేశాల మధ్య సహకారం…

అమెరికా ఆర్ధిక పరిస్ధితులే బ్లడ్ బాత్ కి కారణం -2

“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బి‌జే‌పి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టి‌సి‌జి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బి‌జే‌పి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం…

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ –విశ్లేషణ 1

సోమవారం ప్రపంచం లోని వివిధ ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ మొత్తంలో నష్టపోయాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ భారీ పతనాన్ని బ్లడ్ బాత్ గా అభివర్ణిస్తున్నాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీ అయిన డౌ జోన్స్, 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కాలంలో కూడా ఎరగని విధంగా ఒకే రోజు 1175 పాయింట్లు నష్టపోయింది. కాబట్టి బ్లడ్ బాత్ అనడం కరెక్ట్ అనిపించక మానదు. అంకెల్లో చూసినప్పుడు ఇంత భారీ పతనాన్ని డౌ…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -2

మోడికి దక్కిన ఈ పోస్ట్ మెన్ / కొరియర్ పాత్రకే భారత మీడియా, బి‌జే‌పి నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచ వేదికలపై భారత్ కు ప్రతిష్ఠ పెరిగింది అని చెప్పడానికి ఇదే తార్కాణం అని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. బలి ఇచ్చేముందు మేకపోతును అందంగా అలంకరించి, డప్పు వాయిద్యాల మధ్య వీధుల వెంట ఊరేగిస్తారన్న ఎరుక వీరికి లేకపోవడం భారత ప్రజల దౌర్భాగ్యం. కాగా మోడీ, ట్రంప్ ను తప్పు పట్టడాన్ని చైనా భలే సంతోషపడింది. దావోస్ వేదికపై…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -1

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆల్పైన్ పర్వతాల లోని విడిది నగరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రారంభ ప్రసంగం చేసి వచ్చాడు. మోడీతో పాటు పలు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు కూడా వేదికపై ప్రసంగాలు చేస్తున్నారు. 2000 సం. తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నాడు. అందుకు అమెరికాకు కారణాలు ఉన్నాయి. అధ్యక్షుడు…

బడ్జెట్ 2018-19: ఉద్యోగులకు తొండి చెయ్యి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర కావడంతో వారి ఆశలు ఇంకా పెరిగాయి. ఓట్ల కోసం ఆదాయ పన్ను విషయంలో మరింత రాయితీ ఇస్తాడని ఆశించారు. కానీ వారిని జైట్లీ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో ఉన్న రాయితీలలో ఎలాంటి మార్పూ లేకుండా అట్టే కొనసాగించింది. విద్యా సెస్ కు ఆరోగ్యం జత కలిపి 1% అదనంగా సెస్ వసూలు చేస్తామని ప్రకటించారు. గత సంవత్సర…

ఎకనమిక్ సర్వే 2018: 10 ప్రధాన అంశాలు

జనవరి 29 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే – 2018, 10 ప్రధాన అంశాలను గుర్తించింది. ఇవి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణీయన్ దృష్టిలో ప్రధానమైనవి. ‘పది కొత్త ఆర్ధిక నిజాలు’ అని సర్వే వీటిని అభివర్ణించింది.  ప్రజల వైపు నుండి చూసినపుడు ప్రధానం కావచ్చు, కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారు కనుక ఈ అంశాలు పాలకవర్గాల దృక్కోణం నుండి ప్రధాన అంశాలుగా ఉంటాయని గుర్తించడం సబబు.…

ఆర్ధిక వ్యవస్ధకు యుగాంతం ప్రమాదం! -ఎకనమిక్ సర్వే హెచ్చరిక

భారత ప్రభుత్వం 2018-19 కి గాను ఎకనమిక్ సర్వేను విడుదల చేసింది. ఏటా బడ్జెట్ ప్రకటనకు ముందు విడుదలయ్యే ఎకనమిక్ సర్వే భారత ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి (జి‌డి‌పి గ్రోత్ కి) నాలుగు పెద్ద గండాలు ఉన్నాయని హెచ్చరించింది. భారత దేశానికి ప్రధాన ఆర్ధిక సలహాదారు (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) అరవింద్ సుబ్రమణియన్ రచించిన ఎకనమిక్ సర్వే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పుకుంటున్న ఆర్ధిక గొప్పలను పరిహాసం చేసినంత పని…

ఐఫోన్ X: తయారీ ఖర్చు $358, అమ్మకం ధర $1570 -విశ్లేషణ

మాకింతోష్ (మ్యాక్) కంప్యూటర్, ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్… ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎంత గిరాకీ అంటే ప్రపంచంలో అనేక దేశాల జి‌డి‌పి విలువల కంటే ఎక్కువగా యాపిల్ కంపెనీ వద్ద డబ్బు పోగుబడేటంత! ఐ ఫోన్ ను సొంతం చేసుకోవడం కోసం రెండేళ్ల క్రితం చైనా యువకుడు ఒకరు తన కిడ్నీని అమ్ముకున్నాడంటే యాపిల్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తంలో…

ఇటలెగ్జిట్ తప్పదా?

యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ బైటికి వెళ్లిపోవడాన్ని బ్రెగ్జిట్ అన్నారు. అలాగే యూరో జోన్ నుండి ఇటలీ బైటికి వెళ్లడాన్ని ఇటలెగ్జిట్ అంటున్నారు. ఇటలీ ఋణ భారం పెరగడమే తప్ప తగ్గే జాడ కనిపించడం లేదు. దానితో ఉమ్మడి కరెన్సీ యూరోను త్యజించి తన జాతీయ కరెన్సీని మళ్ళీ అమలు చేయాలన్న వాదనకు ఇటలీలో మద్దతు పెరుగుతోంది. బ్రిటన్ యూరో జోన్ లో సభ్యురాలు కాదు. అంటే బ్రిటన్ ఉమ్మడి కరెన్సీ యూరో ను తమ కరెన్సీగా…

డీమానిటైజేషన్ వల్లే జి‌డి‌పి తగ్గింది -పాల్ కృగ్మన్

పాల్ రాబిన్ కృగ్మన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త. 2008లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో సత్కారం పొందిన ప్రముఖుడు. ‘న్యూ ట్రేడ్ ధియరీ’ మరియు ‘న్యూ ఎకనమిక్ జాగ్రఫీ’ సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకు ఆయనకు ఆ సత్కారం ఆ దక్కింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కాలమిస్టు కూడా. ఆయన మాటలకు పెట్టుబడిదారీ ప్రపంచం విలువ ఇస్తుంది. అలాంటి పాల్ కృగ్మన్ భారత జి‌డి‌పి వృద్ధి…