2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

2జి స్పెక్ట్రం కేసులో ఎవరు బయట, ఎవరు లోపల? -గ్రాఫిక్స్

2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి బుధవారం అనుకోని పరిణామం సంభవించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓ లు ఐదుగురికి బుధవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో జైలులోనే ఉన్న మిగిలిన వారికి కూడా బెయిల్ ఆశలు పుడతాయని చెప్పవచ్చు. ఈ కేసులో హై ప్రొఫైల్ ముద్దాయిలయిన ఎ.రాజా, కనిమొళిలకు కూడా దొరకని బెయిల్ కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓలకు దొరికింది. వీరు కాక జైలులో ఇంకా తొమ్మిది మంది ఉన్నారు. –…

టెలికం (2జి) కుంభకోణంలో మన్మోహన్, చిదంబరంలు రాజీనామా చేయాలి -బి.జె.పి

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా 2జి స్పెక్ట్రం లైసెన్సులను చౌకరేట్లకు జారీ చేసిన నిర్ణయంలో ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పాత్ర కూడా ఉందనీ, వారికి తెలియకుండా ఏ నిర్ణయమూ జరిగే అవకాశం లేదనీ ఢిల్లీలోని సి.బి.ఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్న నేపధ్యంలో వారిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే ఫోన్‌ను ట్యాప్ చేయడం, అక్రమ మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక సి.ఎం…

కోర్టులో మన్మోహన్, చిదంబరం పేర్లను ప్రస్తావించిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా

ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్‌నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు.…

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం: కేంద్ర మంత్రి దయానిధి మారన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సి.బి.ఐ ని తనపని తనను చేసుకోనిస్తే తగిన ఫలితాలను చూపించగల సత్తా ఉన్న సంస్ధ అని నిరూపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తాత్కాలికంగా తప్పించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఒక్కో తీగా లాగుతూ అనేక డొంకల్ని కదిలిస్తోంది. సి.బి.ఐ బుధవారం సుప్రీం కోర్టుకి సమర్పించిన ‘స్టేటస్ రిపోర్ట్’ లో ప్రస్తుతం కేంద్రంలో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ అఘాయిత్యాన్ని పొందుపరిచింది. మలేషియా కంపెనీకి మేలు చేయడానికీ,…