ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ
రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ)…