సరిహద్దులో భారత్ హెలికాప్టర్ ను బలవంతంగా దింపిన పాకిస్ధాన్ ఫైటర్ జెట్లు

భారత హెలికాప్టర్ ఒకటి పాకిస్ధాన్ గగనతలంలోకి చొరబడడంతో పాకిస్ధాన్ మిలట్రీకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు దానిని బలవంతంగా కిందికి దింపాయి. హెలికాప్టర్ లో నలుగుతు భారత్ మిలట్రీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ గగనతలంలోకి జరిగిన చొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదనీ, దట్టంగా మంచు కమ్మడంతో జరిగిందనీ భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నలుగురు అధికారులు ప్రస్తుతం పాకిస్ధాన్ కస్టడీలో ఉన్నారు. నలుగురు క్షేమంగా ఉన్నారని పాకిస్ధాన్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట…