ప్రవాసంలోనే మరణించిన “పికాసో ఆఫ్ ఇండియా” ఎమ్.ఎఫ్.హుస్సేన్

“పికాసో ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత భారత పెయింటింగ్ కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంలో ఉండగానే మరణించాడు. 2006 సంవత్సరంలో లండన్‌కి ప్రవాసం వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ కొన్ని నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయేనాటికి ఖతార్ పౌరుడుగా ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ భారత దేశంలో అనేక సార్లు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశ సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము నియమించుకున్న హిందూ మత సంస్ధల కార్యకర్తలు అనేక సార్లు ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడులు చేసి…