గుర్రాల వ్యాపారి హసన్ ఆలీ ఖాన్ విదేశీ బ్యాంకులకు తరలించింది రు.3600 కోట్లు -ఇ.డి

పూనే గుర్రాల వ్యాపారి ‘హసన్ ఆలీ ఖాన్’ 800 మిలియన్ డాలర్ల (రు.3600 కోట్లు) నల్లధనాన్ని విదేశీ బ్యాంకులకు తరలించాడని ఆర్ధిక నేరాల దర్యాప్తు సంస్ధ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, బోంబే హైకోర్టు కు సోమవారం తెలిపింది. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని బ్యాంకులకు ఈ డబ్బు తరలించినట్లుగా ఇ.డి కోర్టుకు తెలిపింది. ఈ విదేశీ బ్యాంకుల అధికారులతో హసన్ ఆలీ ఖాన్‌కు లోతైన సంబంధాలున్నాయని ఇ.డి తెలిపింది. సెషన్స్ కోర్టు హసన్ ఆలీ ఖాన్ కు…