ముంబైలో మళ్ళీ బాంబు పేలుళ్ళు, 21 మంది దుర్మరణం, 141 మందికి గాయాలు -అప్ డేట్

ముంబైలోని జన సమ్మర్దమైన ప్రాంతాల్లో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్ళలో దుర్మరణం పాలైనవారి సంఖ్య 21 కి చేరుకోగా, 141 మంది గాయపడ్డారని తేలింది. పేలుళ్ళలో ఆత్మాహుతి బాంబుదాడిని కొట్టిపారేయలేమని పోలీసులు చెబుతున్నారు. గం.6:54ని.లకు దక్షిణ ముంబైలోని జావేరి బజార్లో పేలిన మొదటి బాంబు శక్తివంతమైనదని తెలుస్తోంది. గం.6:55ని.లకు రెండవ బాంబు సెంట్రల్ ముంబైలో దాదర్ సబర్బన్ రైల్వే స్టేషన్ సమీపంలోని కబూతర్‌ఖానా బస్ స్టాప్ వద్ద పేలిందనీ, గం.7:05ని.లకు మూడవ బాంబు దక్షిణ ముంబైలోని ఒపేరా…

7/11 (జులై 2011) ముంబై బాంబు పేలుళ్ళు -ది హిందూ ఫొటోలు

జులై 13, 2011 రోజు, భారత ప్రజల జీవితాల్లో మరొక దుర్దినంగా నమోదు కానున్నది. నేడు జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఫోటో గ్రాఫర్ వివేక్ బెంద్రె కెమెరాలో బంధించగా ‘ది హిందూ’ పత్రిక తన వెబ్‌సైట్ లో ప్రచురించింది. ఫోటోలు చూడ్డానికి భయానకంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏడు ఫొటోలు ఒపేరా హౌస్ వద్ద జరిగిన పేలుడు అనంతరం తీసినవి కాగా ఒకటి దాదర్ స్టేషన్ దగ్గరి దృశ్యాన్ని టీవి ఛానెల్ చూపుతోంది. పాకిస్ధాన్ ప్రభుత్వం…