షిండే గారు మళ్ళీ తొట్రుపడ్డారు…

అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ లాగా భారత హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తొట్రుపడం అలవాటుగా మారినట్లుంది. ప్రభుత్వం లోని పెద్దలు రహస్యంగా దాచిపెట్టుకోవాల్సిన అంశాలను బహిరంగంగా ప్రకటించి ఆనక నాలిక్కరుచుకోవడం జో బిడెన్ కు ఉన్న అలవాటు. ఆ అలవాటు వలన బిడెన్ పైన అమెరికాలో అనేక జోకులు వ్యాప్తిలో ఉన్నాయి. మన షిండే గారు కూడా చెప్పకూడని సంగతులు బైటికి చెప్పడం, అనకూడని మాటలు అనేయడం, ఆనక ‘సారీ‘ చెప్పడం మామూలుగా మారింది.…

హైదరాబాద్ బాంబు పేలుళ్లు, ముందే సమాచారం?!

హైదరాబాద్ మళ్ళీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. అత్యంత రద్దీగా ఉండే దిల్ షుక్ నగర్ బస్ స్టాండ్ ప్రాంతంలో రెండు చోట్ల అమర్చిన సైకిల్ బాంబులు పేలడంతో అనేకమంది మరణించగా మరెంతోమంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారని, మరో 80 మంది గాయపడ్డారని, గాయపడినవారిలో ఐదు లేక ఆరుగురు తీవ్రంగా గాయపడినందున వారి పరిస్ధితి ప్రమాదకరంగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పత్రికలు, ఛానళ్లతో క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పాడు. ముఖ్యమంత్రి పత్రికలతో…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…