శ్రీకాంత్ గారూ, కిషన్ జీ పార్టీ చేస్తున్నది సాయుధ పోరాటం, సాయుధ అల్లర్లు కాదు

శ్రీకాంత్ గారూ, మీ బ్లాగ్ లో నన్ను ఉద్దేశిస్తూ మంచి ప్రశ్న వేశారు. (ఆ పోస్టును ఇక్కడ చూడండి) సిరియాలో తిరుగుబాటు పేరుతో అక్కడి తిరుగుబాటుదారులు చేస్తున్నది కేవలం అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసమే. వారు టర్కీ, ఉత్తర లెబనాన్ లలో ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ గూఢచారుల వద్ద శిక్షణ పొంది సిరియాలో ప్రవేశించి ప్రజలపై కాల్పులు జరుపుతూ ఆ నేరాల్ని సిరియా అధ్యక్షుడు, సైన్యం పైన మోపుతున్నారు. పశ్చిమ దేశాల పత్రికలు కూడా…

లిబియా దాడులతో స్పష్టమైన అమెరికా బలహీనత -న్యూ డెమొక్రసీ నాయకుడు

లిబియా పై పశ్చిమ దేశాలు తలపెట్టిన దాడుల ద్వారా అమెరికా బలహీన పడిందని రుజువైందని సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూ డెమొక్రసీ) నాయకులు పి. ప్రసాద్ అన్నారు. లిబియాపై పశ్చిమ దేశాలు జరుపుతున్న దుర్మార్గ దాడులకు నాయకత్వం వహించడానికి అమెరికా సంసిద్ధంగా లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ల దురాక్రమణ యుద్ధాల్లో పీకల దాకా కూరుకు పోయి బైట పడలేక సంగతి మన కళ్ళ ముందున్నదనీ,…

పెళ్ళి మాటున జన సమీకరణ, మిలియన్ మార్చ్ కోసం న్యూడెమొక్రసీ ఎత్తుగడ

మిలియన్ మార్చ్ కోసం పోలీసులు కనీ వినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. “ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడుతుందనే మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు తప్ప వేరేదానికి కాదు” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మార్చ్ అనంతరం ప్రకటించిన విషయం వార్తా ఛానెళ్ళలో ప్రసారం కావడం కూడా అందరూ చూశారు. అంటే ముఖ్యమంత్రి ఆదేశం మేరకే పోలీసులు తెలంగాణ అంతటా ఎవరూ హైద్రాబాద్ కు రాకుండా నిర్బంధించారనేది అర్ధం అవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం…

తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి…