జలాంతర్గామి పేలుడు: గుర్తుపట్టలేని స్ధితిలో శవాలు

ముంబై డాక్ యార్డ్ లో అనూహ్య కారణాలతో పేలిపోయి మునిగిపోయిన ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ జలాంతర్గామి నుండి నాలుగు శవాలను వెలికి తీశారు. ఈ శవాలు గుర్తు పట్టలేని స్ధితిలో ఉన్నాయని తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో డి.ఎన్.ఏ శాంపిల్ సహాయంతో గుర్తుపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాంతర్గామిలో సజీవులుగా ఎవరైనా మిగిలి ఉండే అవకాశాలు పూర్తిగా అడుగుంటాయని అధికారులు చెబుతున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి మాత్రం అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదని జలాంతర్గామి లోపల గాలి గదుల్లో…

ముంబై: జలాంతర్గామి పేలుడు, మునక -18 మంది మరణం?

భారత నౌకాదళం బుధవారం తెల్లవారు ఝాము భారీ మూల్యం చెల్లించింది. సంప్రదాయక సబ్ మెరైన్ లో పేలుడు సంభవించి ముంబై డాక్ యార్డ్ లో మునిగిపోవడంతో 18 మంది నావికాదళ సభ్యులు చనిపోయినట్లు భావిస్తున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సింధూరక్షక్’ అనే పేరుగల ఈ జలాంతర్గామును రష్యా సరఫరా చేసింది. కిలో క్లాస్ యుద్ధనౌకగా భావించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళంలో ఒక ముఖ్య భాగం అని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వలన…