‘సాక్షి’ కి ప్రకటనలు ఇవ్వొద్దు -ఎ.పి ప్రభుత్వం ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్ధాపించిన దిన పత్రిక ‘సాక్షి’ కి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరాదని ప్రభుత్వం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వై.ఎస్.ఆర్ స్ధాపించిన ‘ఇందిర’ టి.వి కి కూడా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ‘అక్రమ ఆస్తుల’ కేసు విచారణకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇరు సంస్ధలకు చెందిన బ్యాంకు ఖాతాలను సి.బి.ఐ స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత…