ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం…

పాకిస్ధాన్‌కి 50 ఫైటర్ జెట్స్ సరఫరాకు చైనా అంగీకారం

పాకిస్ధాన్ కు గతంలో హామీ ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఫైటర్ జెట్లను సరఫరా చేయడానికి చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని ప్రస్తుతం చైనా పర్యటిస్తున్న సంగతి విదితమే. లాడెన్ ను అబ్బోత్తాబాద్ లో అమెరికా కమెండోలు చంపిన తర్వాత పాక్ అమెరికా ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టినట్లు పత్రికలు కోడై కూస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అమెరికా కాకుంటే తమకు చైనా మిత్ర దేశం అండగా ఉండగలదన్న సూచనలు ఇవ్వడానికి…