టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధి టీచర్ ని కత్తితో పొడిచి చంపిన దారుణం తమిళనాడులోని ఓ ప్రవేటు స్కూల్ లో చోటు చేసుకుంది. ‘స్ట్రిక్ట్ టీచర్’ గా పేరుపొందిన నలభై యేళ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి ఉమా మహేశ్వరి విద్యార్ధుల చదువు గురించి ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. చెన్నైలోని ఆర్మేనియన్ స్ట్రీట్ లో గల ప్యారీస్ కార్నర్ లో గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. గత పది…














