టీనేజి కుర్రాడిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన పాక్ ఆర్మీ -రాయిటర్స్ వీడియో లింక్

సర్ఫరాజ్ షా అనే పేరుగల యువకుడిని పాకిస్ధాన్ పారామిలట్రీ రేంజర్స్ కి చెందిన పోలీసులు, అతను ఓ వైపు దీనంగా బతిమాలుతున్నప్పటికీ క్రూరంగా కాల్చి చంపిన దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. పోలీసులకి, సైనికులకి అధికారం అప్పగిస్తే ప్రజలు ఏం అనుభవించాల్సి వస్తుందో ఈ వీడియో తెలియజెప్పుతోంది. పాక్ ప్రధాని యధావిధిగా, విచారించి దోషులను కఠినంగా శిక్షిస్తామని వాగ్దానం ఇచ్చేశాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మినవారెవరూ లేరని పత్రికలు ఘోషిస్తున్నాయి. http://in.reuters.com/video/2011/06/10/outrage-over-point-blank-teen-killing-in?videoId=212787889&videoChannel=101

ప్రవాసంలోనే మరణించిన “పికాసో ఆఫ్ ఇండియా” ఎమ్.ఎఫ్.హుస్సేన్

“పికాసో ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత భారత పెయింటింగ్ కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంలో ఉండగానే మరణించాడు. 2006 సంవత్సరంలో లండన్‌కి ప్రవాసం వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ కొన్ని నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయేనాటికి ఖతార్ పౌరుడుగా ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ భారత దేశంలో అనేక సార్లు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశ సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము నియమించుకున్న హిందూ మత సంస్ధల కార్యకర్తలు అనేక సార్లు ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడులు చేసి…

పౌరసమాజ నాయకులను ఐక్యం చేసిన రామ్‌దేవ్ అరెస్టు, లాఠీ ఛార్జీ

ఆదివారం వేకువ ఝామున బాబా రాందేవ్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరంపై పోలీసులు దాడి చేయడమే కాకుండా, టియర్ గ్యాసు ప్రయోగించి, లాఠీ ఛార్జీ కూడా చేయడంతో అప్పటివరకు వివిధ కారణాలతో ఎడమొగం పెడమొగం గా ఉన్న పౌర సమాజ నాయకులుగా మన్ననలు అందుకుంటున్నవారిని ఏకం చేసింది. రాం దేవ్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి ముప్ఫై మందిక పైగా కార్యకర్తలను గాయపరచడాన్ని అన్నా హజారే, అరుణా రాయ్, కేజ్రివాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు. కనీసం నిరసన…

ఇ.కొలి: యూరప్‌నుండి కూరగాయల దిగుమతిని నిషేధించిన రష్యా

కీర దోసకాయల ద్వారా  ఇ.కొలి జబ్బు యూరప్ అంతటా విస్తురిస్తుండడంతో రష్యా యూరప్ నుండి గిగుమతి అయ్యే కూరగాయలన్నింటిని నిషేధించింది. దిగుమతి అయ్యే కూరగాయలు వేటినీ వాడవద్దని తన ప్రజలకు సూచించింది. దిగుమతి ఐన కూరగాయలకు బదులు రష్యాలో పండిన కూరగాయలను మాత్రమే వాడాలని హెచ్చరించింది. కూరగాయల భద్రతకు యూరప్ అనుసరిస్తున్న విధానాలను, ఆరోగ్య చట్టాన్ని రష్యా విమర్శించింది. ఈ పద్ధతినే అనుసరించాలని యూరప్ దేశాలు గత కొద్ది సంవత్సరాలుగా రష్యా పైన ఒత్తిడి తెస్తున్నాయి. యూరప్…

సెల్ ఫోన్‌తో కేన్సర్ -ప్రపంచ ఆరోగ్య సంస్ధ

ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్ ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (World Health Organisation – WHO) హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి…

ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…

అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిషేధించటానికి జర్మనీ నిర్ణయం

అణు విద్యుత్ కర్మాగారాలకు సంబంధించి జర్మనీ ప్రభుత్వం సాహసోపేతమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. 2022 కల్లా అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించింది. ఇప్పుడున్న అణు కర్మాగారాలను దశలవారిగా మూసి వేస్తూ, 2022కల్లా అణు విద్యుత్ అనేదే దేశంలో లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. జపాన్‌లో మార్చిలో సంభవించిన భూకంపం, సునామీల వలన 30,000 మంది చనిపోవడమో, ఆచూకీ గల్లంతవడమో జరిగింది. దాంతో పాటు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం భూకంపం, సునామీల ధాటికి బాగా…

ప్రధాని మంచోడే, రిమోట్ కంట్రోల్ తోనే సమస్య -అన్నా హజారే

భారత రాజకీయ నాయకులు , బ్యూరోక్రట్ల అవినీతిని అంతం చేయడానికే కంకణం కట్టాడని భావిస్తున్న అన్నా హజారే తాజాగా సోనియా గాంధీని తన విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బెంగుళూరులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ రిమోట్ కంట్రోలు వల్ల సమస్యలు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశాడు. “ప్రధాన మంత్రి మంచి వ్యక్తి. ప్రధాన మంత్రి చెడ్డవాడు కాడు. రిమోట్ కంట్రోలు కారణంగా సమస్యలు వస్తున్నాయి” అని…

“కులములో ఏముందిరా?” పాత పాట, మంచి పాట!

పాత తెలుగు సినిమా పాటలపై తెలుగు వారి మమకారం శాశ్వతమేనేమో! సందర్భశుద్ధితో రాయడం, సినిమా కధకు తగిన పాటలు కావడం, సందర్భాలకు తగిన విధంగా రాసిన సాహిత్యానికి ఆ తర్వాత మాత్రమే సంగీతం సమకూర్చడం… ఈ కారణాల వలన అప్పటి పాటలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో, గుండెల్లో, నాలుకలపైనా తిష్టవేయగలిగాయి. మరీ ముఖ్యంగా సమాజంలోని వాస్తవ స్ధితిగతులతో సినిమా కధలకు దగ్గరి సంబంధం ఉండడం, ఆయా సినిమా కధల్లోని వివిధ పాత్రలతో తమ నిజ జీవితాలనూ, జీవిత…

అసభ్యకర టి.వి. ప్రకటనలను ప్రసారం చేయవద్దని ఛానెళ్ళను కోరిన ప్రభుత్వం

భారత సమాచార మంత్రిత్వ శాఖ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పచ్చిగా, అసభ్యకరంగా లైంగిక ప్రకటనలను ప్రసారం చేయవద్దని టి.వి చానళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. డియోడెరంట్ అమ్మకం దారులు తమ ఉత్పత్తుల అమ్మకాల కోసం జారీ చేస్తున్న వీడియో ప్రకటనలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ప్రత్యక్షంగా లైంగికతలను ప్రదర్శించే ప్రకటనలు భారత దేశ ప్రచార, ప్రసార చట్టాలను ఉల్లంఘించేవిగా ఉన్నాయనీ, వీటిని ప్రసారం చేయడం వెంటనే ఆపాలని తన ఆదేశాల్లో ప్రభుత్వం కోరించి. అటువంటి ప్రకటనలు…

16 సం. నాన్ బెయిలబుల్ వారంట్ తప్పించుకొని ఇప్పుడు లొంగిపోయిన బీహార్ ఎం.ఎల్.ఎ

ఆయన పేరు రామాధర్ సింగ్. బీహార్‌లో బి.జె.పి పార్టీ తరఫున ఔరంగాబాద్ నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎన్నికయిన ఎం.ఎల్.ఎ. 2010 లో ఎన్నికయ్యాక నితీష్ కుమార్ ప్రభుత్వంలో సహకార శాఖా మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన గురువారం మంత్రి పదవికి రాజీనామ చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా మేరకు గవర్నర్ ఆ ఎం.ఎల్.ఏ రాజీనామాని ఆమోదించాడు. మే 19న రాజీనామా చేశాక బీహార్ హై కోర్టు ఆయనను క్రింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది.…

చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను…

భారత రాయబారి కూతురికి అమెరికా స్కూల్‌లో ఘోర పరాభవం, పరువు నష్టం కేసు దాఖలు

అమెరికా ప్రభుత్వాధికారులు, పోలీసులు, ఇతర తెల్ల మేధావులు భారత అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి భారత మహిళా రాయబారి నుండి బాలివుడ్ హీరో షారుఖ్ ఖాన్ వరకు విమానాశ్రయాలలో తనిఖీలు ఎదుర్కొన్న ఘటనలు మనకు తెలుసు. సిక్కు మతస్ధుడైన భారత రాయబారిని అతని మత సాంప్రదాయన్ని అవమాన పరుస్తూ, పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని అనుమానిస్తూ తలపాగా విప్పించిన ఘటనలు పత్రికల్లో చదివాం. అమెరికా సెక్రటరీ ఆఫ్…

టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను 1 1/2 సం.లు భద్రంగా ఉంచడానికి ఐన ఖర్చు రు.11 కోట్లు

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాల్గొని దొరికిపోయిన అజ్మల్ కసబ్ భద్రత కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 10.87 కోట్ల రూపాయలని తేలింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐ.టి.బి.పి) విభాగం అజ్మల్ కసబ్ కి సెక్యూరిటీ అందిస్తున్నందుకు ఇప్పటివరకూ ఖర్చయిన రు. 10.87 కోట్లను తమకు తిరిగి చెల్లించాలని బిల్లు పంపడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కి గురైంది. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్.కె.భాటియా ఈ బిల్లును పంపాడు. మార్చి 28, 2009 నుండి సెప్టెంబరు…

ఆడపిండం హత్యలు విద్యాధిక కుటుంబాలలోనే ఎక్కువ -సర్వే

ఆడపిల్లలను పిండ దశలోనే హత్య చేయడం నిరక్ష్యరాస్య కుటుంబాల కంటే విద్యాధిక కుటుంబాలలోనూ, ధనికుల కుటుంబాలలోనూ అధికంగా జరుగుతున్నాయని భారత దేశంలో జరిగిన ఓ సర్వేలో తేలింది. విద్యాధిక, ధనిక కుటుంబాలు మొదటి బిడ్డ ఆడపిల్ల పుట్టాక రెండవ బిడ్డ ఆడపిల్లే పుట్టబోతున్నదని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా రెండో ఆడపిల్లలను పిండ దశలోనే చంపివేయడం విద్యాధికులు, ధనికుల కుటుంబాలలోనే అధికంగా ఉండడం కలవరపరిచే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్…