లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!

తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ‘సీమాంధ్రులు కూడా’ కూడా కాదు, దేశ ప్రజలంతా తెలుసుకోవలసిన విలువైన విషయం బెజవాడ ఎం.పి, లాంకో యజమాని, లగడపాటి రాజగోపాల్ గారు బుధవారం తెలియజేశారు. “ఆస్తులు కాపాడుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్టు కాదు. నేను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నది నా ఆస్తులను కాపాడుకోవడానికి కాదు. దేశ సమగ్రతను కాపాడడం కోసం” అని సగర్వంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేస్తున్న జవాన్ స్ధాయిలో…

మరొకసారి వెల్లడైన కావూరి సాంబశివరావు దురహంకారం

కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9, 2009 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు ఏలూరు ఎం.పి. కావూరు సాంబశివరావు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసో లేదో కానీ ఆ తర్వాత ఆయన చేస్తూ వచ్చిన దురహంకార పూరిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ట ఎంత నేలబారుదో వెల్లడి చేశాయి. కొద్ది నెలల క్రితం తెలంగాణ లాయర్లు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినపుడు పోలీసులు సృష్టించిన హడావుడి ఉద్రిక్తతకు దారితీసింది. అప్పుడు కావూరివారు “రెండు కాకపోతే…

“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో…

రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నది బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులే -సుప్రీం కోర్టు

రిజర్వేషన్ కోటాల వలన సమకూరుతున్న ఫలితాలను ఆ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు మాత్రమే లబ్ది పొందుతున్నారని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అవి ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వారికి అసలు రిజర్వేషన్ల సంగతే తెలియడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ కె.వి.రవీంద్రన్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఈ వ్యాఖ్యానాలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు), ఢిల్లీ యూనివర్సిటీలలో జరిగే అడ్మిషన్లలో ఒ.బి.సి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం…

ముంజేతులు లేవు, ఐనా స్పిన్ బౌలింగ్‌లో ఘనాపాటి ఈ బాలుడు -వీడియో లింక్

బ్రిటన్‌కి చెందిన కీరన్ టంగ్-గిబ్స్ కి పుట్టుకతోనే ముంజేతులు లేవు. ఒక చేతికి మోచేయి తర్వాత కొద్ది భాగం ఉండగా, రెండో చేతికి మోచేయి కూడా లేదు. అయినా ఒక చేతికి ఉన్న మోచేయిలో క్రికెట్ బంతిని ఇరికించుకుని ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం స్పిన్ ని జతచేసి మరి బంతులు విసురుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అవే చేతుల్తో బ్యాటింగ్ చేయగలుగుతూ అంగ వైకల్యాన్ని గేలి చేస్తున్నాడు. బ్రిటన్ దేశానికి ఆడాలని కలలు గంటున్న ఈ…

‘ఓటుకు నోటు’ కేసులో రెండవ అరెస్టు, ఈ సారి బిజెపి వంతు?

సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు.…

తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టు, ఫుకుషిమా అణు ప్రమాదం, కొన్ని సంగతులు

ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో యురేనియం నిల్వలున్న ప్రాంతంగా పేరు సంపాదించుకున్న తుమ్మలపల్లె గ్రామం కడప జిల్లా పులివెందుల మండలంలో ఉంది. ఇక్కడ 49,000 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారని మాత్రమే నిన్నటి వరకూ లోకానికి తెలుసు. అయితే రాజస్ధాన్‌లో, దేశంలోని 25వ అణు విద్యుత్ రియాక్టర్ నిర్మాణానికి శంకుస్ధాపన కోసం విచ్చేసిన భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ, తుమ్మలపల్లెలో గతంలో నిర్ధారించినట్లుగా 49,000 టన్నులు కాకుండా దానికి మూడు రెట్లు, అంటే…

ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిల్వలున్న తుమ్మలపల్లె ఆంధ్రప్రదేశ్ కి వరమా? శాపమా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి దాపురించింది. అణు బాంబులతో పాటు అణు విద్యుత్‌కి వినియోగించే యురేనియం నిల్వలు ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లెలో పుష్కలంగా ఉన్నాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ తెలిపాడు. ప్రపంచంలో మరెక్కడా ఒకే చోట ఇంత అధిక స్ధాయిలో యురేనియం నిల్వలు ఉన్న ప్రాంతం లేదని ఆయన తెలిపాడు. ఇటీవల జరిపిన అధ్యయనాల ద్వారా తుమ్మలపల్లెలో35 కి.మీ పరిధిలో1.5 లక్షల టన్నుల యురేనియం ఖనిజ నిల్వలు ఉన్నాయని…

ప్రభుత్వ లోక్‌పాల్ డ్రాఫ్టు దేశ ప్రజల పైకి విసిరిన ఓ పెద్ద జోక్ -ప్రధానికి లేఖలో హజారే

ప్రభుత్వ లోక్ పాల్ డ్రాఫ్టు చాలా బలహీనమైనదనీ, తప్పించుకోవడానికి అవసరమైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నదనీ కనుక తాము రూపొందించిన జన్ లోక్‌పాల్ డ్రాఫ్టును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రభుత్వం రూపిందించిన లోక్ పాల్ డ్రాఫ్టు భారత దేశ ప్రజల మీదికి విసిరిన ఒక పెద్ద జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రధానికి రాసిన లేఖలో అన్నా హజారే, ఆమరణ దీక్షకు దిగుతానన్న తన నిర్ణయాన్ని…

బ్రిటన్‌ని ఊపేస్తున్న ఫోన్ హ్యాకింగ్ స్కాండల్‌లో ప్రధాని కామెరూన్ సన్నిహితురాలు రెబెక్కా అరెస్టు

మీడియా రారాజుగా అభివర్ణించబడుతున్న స్టార్ ఛానెళ్ళ అధినేత రూపర్ట్ మర్డోక్‌కి చెందిన “న్యూస్ ఆఫ్ వరల్డ్” పత్రిక విలేఖరులు వివిధ నేరాలలో భాధితులైన వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ చేసి అందులోని సమాచారాన్ని దొంగిలించి పత్రిక కధనాలకు వినియోగించారన్న ఆరోపణలతో బ్రిటన్ మీడియా ప్రపంచం అట్టుడుకుతోంది. మర్డోక్‌కి కుటుంబ స్నేహితురాలు, ప్రధాని కామెరూన్‌కు మీడియా అడ్వైజర్‌గా కూడా పేరుపొందిన, “న్యూస్ ఇంటర్నేషనల్” పత్రిక ఛీఫ్ ఎడిటర్ రెబెక్కా బ్రూక్స్‌ను పోలీసులు “ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం” తో సంబంధం ఉందన్న…

అమెరికాలో “ది గ్రేట్ రిసెషన్” తర్వాత మొలిచిన కొత్త ఉద్యోగాలు కేవలం “అర మిలియన్” -టేబుల్

ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన “ది గ్రేట్ రిసెషన్,” అమెరికాలో డిసెంబరు 2007 లో ప్రారంభం కాగా, జూన్ 2009 లో ముగిసిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుండి అమెరికాలో ప్రవేటు కంపెనీలు రిసెషన్ ముందు స్ధాయిలో లాభాలు సంపాదిస్తుండగా, ఉద్యోగాల మార్కెట్ మాత్రం ఇంకా కోలుకోలేదు. సంక్షోభం ముగిసాక జూన్ 2009 లో అమెరికాలో 130.5 మిలియన్ల ఉద్యోగాలు ఉండగా, వాటి సంఖ్య రెండేళ్ళ తర్వాత జూన్ 2011 నాటికి కేవలం అర మిలియన్…

‘సి’ ఫర్ ‘కేపిటలిజం’ -కార్టూన్

నూతన మిలీనియంలో భాషలో ఇప్పటికే ఉన్న పదాలకు కొత్త అర్ధాలు వచ్చి చేరుతున్నాయి. నిన్న ఉన్న అర్ధం నేడు ఉండకపోవచ్చు. ఈ రోజున్న అర్ధం రేపు పాతబడిపోవచ్చు.  పాత సీసాలోనే కొత్త సారా అన్నమాట! పైకి ఎప్పటిలాగే కనపడినా లోపల సారంలో మాత్రం  తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక దేశంపైకి దాడి చేయడానికి ఆ దేశంలో ప్రపంచాన్ని నాశనం చేయగల “సామూహిక విధ్వంసక ఆయుధాలు” ఉన్నాయని సాకు చూపడం నిన్నటి టెక్నిక్కు. ఆ దేశంలోని ప్రజల రక్షణకే…

స్త్రీలు కొన్ని పరిమితుల్లో ఉండాలి -ఢిల్లీ పోలీసు కమిషనర్

ఆడవాళ్ళకు సుద్దులు చెప్పేవారి క్లబ్బులో మరో ఉన్నతాధికారి సభ్యత్వం తీసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.కె.గుప్తా శనివారం ఆడవాళ్ళు ఏ సమయాల్లో బైటికి రావాలో, ఏ సమయాల్లో బైటికి రాకూడదో, బైటికి వచ్చేటప్పుడు ఎవరిని వెంటబెట్టుకుని రావాలో కూడా ఆయన తెలిపాడు. తద్వారా సమాజం స్త్రీలు స్వేచ్ఛగా బైటికి రావడానికి అంగీకరించే పరిస్ధితిలో లేదని మరొక సారి రుజువు చేశాడు. “ఆడవాళ్ళు ఏ సమయంలోనైనా బైటికి రావచ్చు. అది వారి ప్రాధమిక హక్కు. వారి హక్కును కాపాడ్డం…

13 ఏళ్ళ బాలుడి హత్య కేసులో రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసిన సి.బి-సి.ఐ.డి

తమిళనాడులోని మిలట్రీ నివాస సముదాయం వద్ద బాదం కాయకోసం చెట్టెక్కుతున్న 13 సంవత్సరాల బాలుడు దిల్షాన్‌ను తుపాకితో కాల్చి హత్య చేసిన కేసులో సి.బి-సి.ఐ.డి విభాగం ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారిని అరెస్టు చేసింది. బాలుడిపై కాల్పులు జరిపింది తానేనని ఆయన అంగీకరించినట్లు సమాచారం. బాలుడు చనిపోయిన రోజున మిలట్రీ నివాస సముదాయం వద్ద సాయుధ సెక్యూరిటీ గార్డులను తాము నియమించలేదని ఆర్మి అధికారులు చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేసును సీరియస్‌గా తీసుకోవడంతో కేసులో పురోగతి…

పోర్నోగ్రఫీ ధుష్ప్రభావం: ఐదేళ్ళ పాప హత్య కేసులో పదేళ్ళ బాబు అరెస్టు

అభం శుభం తెలియని పసి పిల్లలపై పోర్నోగ్రఫీ ఎంత దుష్ప్రభావం పడేస్తుందో ఈ సంఘటన తెలుపుతుంది. ఐదేళ్ళ బాలిక చెరువులో పడి మృతి చెందిన కేసులో పదేళ్ళ బాలుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో నెడుంగండం గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని “ది హిందూ” పత్రిక తెలిపింది. బాలిక శవం నెడుంగండం లోని ఎస్టేట్ ఏరియా వద్దనున్న చెరువులో లభించిందని పత్రిక తెలిపింది. బాలుడు చేసిన రేప్…