కాళ్ళు చేతుల్లో ఉన్నది ఒక్కటే కాలు, ఐనా ఆమె స్ధైర్యం చూడండి -ఫొటో
ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు? చెల్లీ, నీ పేరు నాకు అనవసరం. నీకు వేనవేల అభివందనాలు – –
ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు? చెల్లీ, నీ పేరు నాకు అనవసరం. నీకు వేనవేల అభివందనాలు – –
meeru extreme content post chesinappudu ilantivanne common. mee abiprayalanu prjala meeda ruddite, vallaku telsindi vallu mee meeda ruddutaaru, tappadu mari. for example, ee roju CRPF gurunchi raasaaru meeru, just copy chesaaremo teleedu. kaanee vaallu prajala cheta ennukobadina valla orders paatistunnaru. we trained them like that. adi valla tappu kaadu. meeru valla chetulaki raktam antinchaaru, adi…
1) 82.28.154.58 2) 141.0.8.142 మొదటి ఐ.పి నెంబరు నుండి ఓ పది సార్లు బూతు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ ఐ.పి నెంబర్ ప్రాక్సీ కాకపోతే ఆ వ్యక్తి ఇంగ్లండ్ నుండి పోస్ట్ చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఆ మధ్య వరకూ బ్లాగ్ ను పొగుడుతూ రాసి, ఆ తర్వాత తిట్టడం మొదలు పెట్టిన వ్యక్తే ఈ బూతులు కూడా రాస్తున్నాడా అన్న అనుమానం కలుగుతోంది. కాదేమో అని కూడా అనిపిస్తోంది. రెండో నెంబరు నుండి నాలు…
తమ శరీరాలనే కాన్వాస్ లు గా మలుచుకుని ప్రదర్శించే కళ బాడీ ఆర్ట్. ఈ బాడి ఆర్ట్ కి సంబంధించి నవంబరు 20 తేదీన వెనిజులా లోని కారకాస్ నగరంలో ప్రపంచ స్ధాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 18 దేశాలనుండి 50 కి పైగా కళాకారులు పాల్గొన్నారు. బాడీ ఆర్ట్ లో శరీరాలపై పెయింట్లు వేసుకోవడం, పచ్చ బట్లు పొడిపొంచుకోవడం దగ్గర్నుండి కేవలం ఆభరణాలు ధరించడం వరకూ ఉంటుంది. వివిధ ఊహా చిత్రాలనుండీ తమ తమ…
తమిళనాడు ప్రభుత్వం ‘డ్యాం 999′ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించింది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలనుండి సినిమా ప్రదర్శన పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాడు. ముల్లైపెరియార్ డ్యాం ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మించారని డి.ఎం.కె పార్టీ అధిపతి కరుణానిధి ఆరోపించాడు. లోక్ సభలో బుధవారం డి.ఎం.కె ప్రతినిధులు సినిమాను నిషేధించాలని కోరారు. వైకో నాయకత్వంలోని ఎం.డి.ఎం.కె పార్టీ కూడా సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని కోరింది.…
నరేంద్ర మోడి హయాంలో గుజరాత్ పోలీసులు సాగించిన బూటకపు ఎన్కౌంటర్ ల గుట్టుమట్లు ఒక్కొక్కటీ వెల్లడవుతున్నాయి. నిప్పులాంటి నిజాలు తమను ఆవహించిన నివురుని చీల్చుకుని బైటికి వస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) పందొమ్మిదేళ్ళ విద్యార్ధినితో పాటు మరొక ముగ్గురు యువకులను ఉత్తి పుణ్యానికి కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా కధ అల్లిన ఘటనపైన విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇష్రత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్…
భారత పాలక పార్టీలన్నీ ఇన్నాళ్ళూ కాపాడుతూ వచ్చిన రహస్య సమాచారం ఒకటి, కొద్ది రోజుల్లో బట్టబయలు కానున్నది. ‘సమాచార హక్కు చట్టం’ అమలుకు ఉద్దేశించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కాజేసిన బడా భోక్తల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా ఎగవేసిన పారిశ్రామిక వేత్తల పేర్లను ఆర్.బి.ఐ డిసెంబరు 31 లోగా పబ్లిక్ గా…
తమిళనాడులో ఇరవై మూడేళ్ళ స్త్రీని రేప్ చేసి హత్య చేసిన నేరానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. గత ఫిబ్రవరి నెలలో నిందితుడు వేగంగా పోతున్నరైలు నుండి బాధితురాలు సౌమ్యను తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన సౌమ్యపై రైలు పట్టాలపైనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ముప్ఫై ఏళ్ల నిందితుడు గోవింద చామి అత్యంత క్రూరమైన పద్ధతిలో నేరాలకు పాల్పడ్డాడనీ, ఏ మాత్రం…
– –
గోధ్రా లో రైలు దహనకాండ అనంతరం, నరేంద్ర మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలపై జరిగిన దారుణ హత్యాకాండపై జరుగుతున్న అనేక కేసుల విచారణలో మొదటిసారిగా నేర నిర్ధారణ జరిగింది. సర్దార్ పురా హత్యకాండకుగాను 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. శిక్షలు ఇంకా ఖరారు కావలసి ఉంది. హత్యాకాండపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ విచారణ జరిగిన కేసులో కోర్టులో నేర నిర్ధారణ జరగడం…
తాను అనుకున్న బొమ్మని చాలా వేగంగా ఈ గీసేస్తున్నాడు, ఈ బాలుడు. చూడ్డానికి వీధి బాలుడిలా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఎవరైనా చేరదీసి శిక్షణ ఇవ్వగలిగితే, లేదా ఇప్పిస్తే తన ప్రతిభను ఇంకా ఉన్నత స్ధాయిలో రుజువు చేసుకోగలడేమో. ఫేస్ బుక్ పేజి లో ఈ వీడియో లభ్యమయ్యింది.
ముస్లిం మతస్ధులు దైవ ప్రార్ధన (నమాజు) చేసేటప్పుడు చాలా క్రమ శిక్షణ కనిపిస్తుంది. మిగత మత ప్రార్ధనలలో ఇది పెద్దగా కనిపించదనుకుంటా. హిందూ పుణ్య క్షేత్రాల వద్ద కోలాహలం కనిపిస్తుంది. తిరుపతి దగ్గర్నుండి ఏ గుడి తీసుకున్నా అంతా కోలాహలం. కానుకలు కూడా కోలాహలమే. ప్రసాదం దగ్గర కూడా. బౌద్ధ మత ప్రార్ధనలు ఎలా ఉంటాయో ఎరుగం. శిక్కుల గురుద్వారాల్లో కూడా కోలాహలం కనిపిస్తుంది. అయితే గురుద్వారాల్లో హిందూ దేవాలయాల్లో కనిపించేటంత కోలాహలం ఉండదు. బహుశా జైన…
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు మాలిన ధర్మాన్ని నెత్తిన వేసుకున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులోని కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తూ ఆయన, ప్రముఖంగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆదివారం ఏకంగా కుదంకుళం ప్లాంటు సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం లో భద్రతా ఏర్పాట్లపైన ఏర్పడిన భయాలను పారద్రోలే పనిలో అబ్దుల్ కలాం…
– –