అంతర్జాతీయ సభలో డీజెల్ రేట్లపై ప్రధానికి నిరసన

న్యూ ఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మన్మోహన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ‘ఆసియాలో ఆర్ధిక వృద్ధి, కార్పొరేట్ వాతావరణంలో మార్పులు’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించడానికి లేచినపుడు సుప్రీం కోర్టు అడ్వకేటు ‘సంతోష్ కుమార్’ చొక్కా విప్పి నిరసన తెలిపాడు. పెంచిన డీజెల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాడు. నినాదాలతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు ఆపవలసి వచ్చిందని ‘ది హిందూ’ తెలిపింది. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్…