శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…

శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా…

శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…

జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో ‘అమృత యూనివర్సిటీ‘ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ‘ఆట‘విడుపును సమకూర్చాయి. జయలలిత ‘హుకుం‘ జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ ‘జో హుకుం‘ కొట్టి సలాము చేసింది. చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు…

ఐరాస మానవ హక్కుల ఓటుకు భారత్ పై శ్రీలంక ప్రతీకారం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ…

తమిళనాట ఇపుడు యు.పి.ఎ భాగస్వామి ఎవరు? -కార్టూన్

– డిఎంకె తెగతెంపులు చేసుకోవడంతో యుపిఎలో తమిళనాడు స్ధానం సీటు ఖాళీ అయింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న నేపధ్యంలో తమిళనాడులో ఖాళీ అయిన సీటును భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. తెలియని ప్రేమికుడి కోసం తమిళనాడు (T) గేటు వద్ద ఆ పార్టీ మోహ గీతాలు ఆలపిస్తోందని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేడి రాజుకునేకొద్దీ ఆ గీతాలకు స్పందించే వారు దొరక్కపోరు. వాడుకుని వదిలేయడం భారత పాలకులకు కొత్త…

శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా

శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు…

శ్రీలంక కాకి తమిళనాడుపై ఎగరకూడదు మరి! -కార్టూన్

నేను చెప్పానా? తమిళనాడు పైన ఎగరకపోతేనే మంచిదని….! శ్రీలంక తో భారత దేశానికి ఉన్న ప్రతి సంబంధాన్నీ రాక్షసీకరించే ప్రయత్నాలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పోటీలు పడుతూ తమిళ జాతీయవాదంలో తామే నిఖార్సయినవారమని చెప్పడానికి అసలు సమస్యే కానీ అంశాలని పెద్ద సమస్యలుగా చేస్తున్నారు. ఎల్.టి.టి.ఇ తో పోరులో చివరి రోజుల్లో శ్రీలంక ప్రభుత్వం ఆదేశాల మేరకు తమిళ పౌరులపై సాగిన నరమేధం గురించి నిర్దిష్ట అవగానను ఇంతవరకూ ఈ పార్టీలేవీ…

ప్రభుత్వాల ఉదాసీనత ఫలితం, తమిళనాడులో శ్రీలంక యాత్రీకులపై దాడులు

శ్రీలంక తమిళుల పరిస్ధితిపై కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ రెచ్చగొట్టే ప్రకటనలు వెరసి శ్రీలంక యాత్రీకులపై విద్వేషపూరిత దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు దేవాలయాలను సందర్శించడానికి శ్రీలంక నుండి వచ్చిన యాత్రీకులు మధ్యలోనే ప్రయాణం ముగించుకుని భయాందోళనలతో తిరుగు ప్రయాణం కట్టారు. తమిళనాడు సందర్శనకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం ‘ట్రావెల్ అడ్వైజరీ’ కూడా జారీ చేయవలసిన పరిస్ధితి తలెత్తింది. తమిళనాడు తమిళులనుండి రాళ్ళు, చెప్పుల దాడిని ఎదుర్కొన్న యాత్రికులలో శ్రీలంక తమిళులే మెజారిటీ కావడం జాతి…

శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో…