చమురు లీకేజి శుభ్రం చేసే కార్మికుల కష్టాలు చూసితీరాలి -ఫోటోలు

జులై 17, 2010 తేదీన చైనా ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్ లో చమురు ప్రమాదం సంభవించి ‘పచ్చ సముద్రం’ ను ముంచెత్తింది. చమురు డాక్ యార్డ్ లో చమురు ట్యాంకులు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం చమురు లీకేజీని అరికట్టడానికి, పొర్లిపోయిన చమురుని తిరిగి ఎత్తి వినియోగంలోకి తేవడానికీ, సముద్ర కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఆ దృశ్యాలే ఇవి. 1500 తన్నుల క్రూడాయిలు సముద్రంలోకి ఒలికిపోగా అందులో మూడో వంతుని…

శ్రమ విలువను గుర్తించిన మేధావి ఆమె

ఆమె పేరు క్రాంతి (ట). అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి విజయనగరం జిల్లా ఇట్లమామిడి పల్లిలో వ్యవసాయం చేయడానికి వచ్చిన ఈమె అద్భుత మహిళగా తోస్తోంది. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ సంస్మరణ వ్యాసం కోసం రాజశేఖర రాజు గారి బ్లాగ్ లోకి వెళ్ళి, అక్కడి నుండి ఓ లింక్ పట్టుకుని జర్నలిస్టు అరుణ పప్పు గారి బ్లాగ్ లోకి వెళ్తే ఓ అపూర్వ కధనం కనిపించింది. ఆ కధనం ఆసాంతం చదివాక నిజంగా ఆశ్చర్యంతో ఏ…