అమెరికాలో విలయం సృష్టించిన పెను తుఫాను సాండీ -ఫోటోలు
అమెరికా ప్రజలు గుండెలు చిక్కబట్టుకుని ఆందోళనతో ఎదురు చూసిన పెను తుఫాను సాండీ అనుకున్నట్లుగానే పెను విలయాన్ని సృష్టించింది. బోస్టన్ పత్రిక ప్రకారం సాండీ ధాటికి ఏడు రాష్ట్రాల్లో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రానికి అట్లాంటిక్ తీరం వెంబడి 55 మంది చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. ఐ.హెచ్.ఎస్ గ్లోబల్ ఇన్సైట్ ప్రకారం 20 బిలియన్ డాలర్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది. 10 నుండి 30 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార…

