సముద్రాల ప్రైవేటీకరణ యోచనలో యూరోపియన్ యూనియన్

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలను శాసిస్తున్న బహుళజాతి సంస్ధలు తమ కంటికి కనబడినదల్లా తమదే అంటున్నాయి. భూమిపై ఉన్న సమస్త సంపదలను స్వాయత్తం చేసుకున్న ఈ సంస్ధలు ఇప్పుడు భూ గ్రహం పై మూడు వంతుల భాగాన్ని ఆక్రమించుకుని ఉన్న సప్త సముద్రాలపై కన్నేశాయి. సముద్ర జలాల్లొ ఉండే మత్స్య సంపద మొత్తాన్ని వశం చేసుకొవడానికి పావులు కదుపుతున్నాయి. దానిలో భాగంగా యూరోపియన్ యూనియన్ చేత సముద్ర సంపదలను ప్రవేటీకరించేందుకు ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో దొరికే…

ప్రజల ప్రయోజనాలకు హాని చేశానని ఒప్పుకున్న దమ్మున్న మంత్రి జైరాం రమేశ్

పర్యావరణ చట్టాల అమలు విషయంలో చాలా సార్లు రాజీ పడ్డానని కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ అంగీకరించారు. అనేక పర్యావరణ ఉల్లంఘనలను తాను మాఫీ చేశానని తెలిపారు. చట్టాల ఉల్లంఘనలను క్రమబద్ధీకరించడానికి తాను బద్ధవ్యతిరేకిననీ, కానీ కొన్ని కేసుల్లో రాజీ పడే విధంగా ఒత్తిడులు వచ్చాయనీ తెలిపారు. జైరాం రమేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖను చేపట్టినప్పటినుండీ వాణిజ్య, పరిశ్రమల, వ్యవసాయ మంత్రివర్గాలనుండీ విమర్శలను ఎదుర్కొన్నాడు. చట్టాలంటూ ముంకు పట్టు పట్టి అర్ధిక వ్యవస్ధ వృద్ధికి ఆటంకంగా…

డేటా దొంగతనంలో గూగుల్‌, సౌత్ కొరియా పోలీసుల విచారణ

పశ్చిమ దేశాల్లో ఐదారు సంవత్సరాల నుండి యూజర్ల డేటా దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన గూగుల్ సంస్ధ తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదేపని చేస్తూ దొరికిపోయింది. మంగళ వారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని గూగుల్ ఆఫీసుపై పోలీసులు దాడి చేశారు. గూగుల్‌కి చెందిన మొబైల్ ప్రకటనల యూనిట్ ‘యాడ్‌మాబ్’, మొబైల్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ వివరాలను సేకరించింది. యాడ్‌మాబ్ ను గూగుల్ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ప్రపంచ సెర్చి మార్కెట్లో…

ఆర్.బి.ఐ ద్రవ్యవిధానం దెబ్బకి భారీగా నష్టపోయిన ఇండియా షేర్‌మార్కెట్

భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్‌ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని…

పాక్‌తో చెలిమి ఇండియాతో ఆయుధ వ్యాపారానికి చేటు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

పాకిస్ధాన్‌తో అమెరికాకి ఉన్న స్నేహం వలన ఇండియాతో జరిపే ఆయుధ వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చని ఇండియాలోని అమెరికా రాయబారి అమెరికా మిలట్రీ అధికారులను హెచ్చరించిన సంగతి వికీలీక్స్ వెల్లడి చేసిన డిప్లొమాటిక్ కేబుల్స్ ద్వారా బయటపడింది. అమెరికా ఆయుధాల అమ్మకానికి పోటీగా వచ్చే ఇతర దేశాల కంపెనీలు, పాకిస్ధాన్‌తో అమెరికాకి గల స్నేహం గురించి ఇండియాను హెచ్చరించవచ్చనీ, అందువలన కీలకమైన సమయంలో ఇండియాకి అవసరమైన మిలట్రీ విడిభాగాలు, మందుగుండుల సరఫరాను అమెరికా ఆపేయవచ్చని ఇండియాకు నూరిపోయడం ద్వారా…

ఇండియాకు టైఫూన్, రాఫేల్ లలో ఏ ఫైటర్ జెట్ విమానం మంచిది?

ఇండియా చాలా కాలంగా ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను కొనడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా, ఫ్రాన్సు, స్వీడన్ లతో పాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల ఉమ్మడి కంపెనీ లు తమ ఫైటర్ జెట్ లే కొనమని పోటీ పడుతూ వచ్చాయి. గురువారం భారత ప్రభుత్వ మిలట్రీ అమెరికా, స్వీడన్ లను తన జాబితానుండు తొలగించింది. ఇప్పుడు రెండు ఫైటర్ జెట్లు పోటీ పడుతున్నాయి. ఒకటి నాలుగుదేశాల ఉమ్మడి కంపెనీ యూరో ఫైటర్ తయారు చేసే “టైఫూన్”…

అమెరికా జెట్‌ఫైటర్ల కొనుగోలుకు ఇండియా తిరస్కరణ, స్నేహం దెబ్బతినే అవకాశం

అమెరికా, యూరప్ దేశాల మధ్య జరిగిన పోటీలో ఎట్టకేలకు అమెరికా ఓడిపోయింది. అమెరికాకి కాంట్రాక్టు ఇవ్వడానికి నిరాకరించడంతో అమెరికాతో ఇండియా సంబంధాలు దెబ్బతినే అవకాశాం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 11 బిలియన్ డాలర్ల (రు.51,000 కోట్లు) విలువతో ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఇండియా ఒకటిన్నర సంవత్సరాలనుండి ప్రయత్నిస్తున్నది. గత నవంబరు నెలలో ఒబామా ఇండియా సందర్శించినప్పుడు కూడా ఈ కాంట్రాక్టుపై చర్చలు జరిగాయి. ఒబామా సందర్శించినప్పుడు ఇండియా ఏమీ తేల్చి చెప్పలేదు. కాని అమెరికాకి చెందిన…

చైనాలో ప్రైవేటురంగ ఆధిపత్యం ఒక మిధ్య

చైనా ఆర్ధిక వ్యవస్ధలో ఏ రంగ ఆధిపత్యం వహిస్తోంది? ప్రభుత్వ రంగమా? ప్రైవేటు రంగమా? గత 35 సంవత్సరాలనుండి చైనా సంస్కరణలను అమలు చేస్తున్నది గనక అక్కడ ప్రవేటు రంగానిదే ఆధిపత్యం అని అందరూ భావిస్తున్నారు. కాని వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చైనా ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తున్నమాట వాస్తవమె. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా పునరుద్ధరింపబడిన వార్తా వాస్తవమే. కానీ చైనాలో ఇంకా ప్రభుత్వ రంగ పెట్టుబడీదారీ విధానమే ఆధిపత్యంలో ఉందన్న విషయం చాలా…

ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి.…

జపాన్ పునర్నిర్మాణం ఖరీదు రు. 14 లక్షల కోట్లు

శక్తివంతమైన భూకంపం, వినాశకర సునామీల ధాటికి దెబ్బతిన్న ఈశాన్య జపాన్ ని పునర్నించడానికి 300 బిలియన్ డాలర్లు అవసరమని జపాన్ ప్రభుత్వం లెక్కగట్టింది. భూకంపం, సునామీల్లొ ఫుకుషిమా దైచి వద్ద అణు విద్యుత్ కర్మాగారం దెబ్బతిని అందులోని నాలుగు రియాక్టర్ల నుండి రేడియేషన్ వెలువడుతున్న విషయం విదితమే. ప్రమాద స్ధాయి అత్యధిక స్ధాయి 7 గా నిర్ణయించిన ఫుకుషిమా అణు ప్రమాదం నుండి ఆ ప్రాంతాన్ని బైట పడేయడానికి ఎంత కాలం పడుతుందో చెప్పడానికి అణు ప్ల్లాంటు…

పెట్రోలు దాహంలో చైనాతో పోటీ పడుతున్న ఇండియా

అమెరికాతో  పెట్రోలు వనరుల కోసం చైనా పోటిపడడం ఇప్పటివరకూ తెలుసు. తాజాగా ఇండియా చైనాతో పోటీ పడుతున్న పరిస్ధితి నెమ్మదిగానే అయినా స్ధిరంగా తలెత్తుతోంది. అమెరికా దురాక్రమణ యుద్ధాలు చేస్తూ పెట్రోలు కోసం తెగబడుతుంటే, చైనా వాణిజ్య ఒప్పందాల ద్వారా, పెట్టుబడుల ద్వారా పోటీ పడుతోంది. ఇప్పుడు చైనా పద్ధతుల్లోనే ఇండియా కూడా ఆయిల్, గ్యాస్ వనరుల కోసం పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. తాజాగా కజకిస్ధాన్ ఆధీనంలోని పెట్రోల్ బావిలో భారత ప్రభుత్వం సంస్ధ ఓ.ఎన్.జి.సి…