ఎన్.డి.ఎ వంద శాతం ఎఫ్.డి.ఐ రిటైల్ రంగంలో రావాలని ప్రతిపాదించింది కదా -మంత్రి

ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రిటైల్ రంగంలోకి వంద శాతం పెట్టుబడుల రావాలని ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వం అప్పటినుండి అనేక చర్చోప చర్చలు సాగించి కేవలం 51 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రిటైల్ రంగంలోకి అనుమతించాలని ఖుర్షీద్ తెలిపాడు. “రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయం తీసుకునే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటినుండీ అనేక విధాలుగా ఈ విషయమై…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా వ్యాపారస్ధుల బంద్

గురువారం భారత దేశ వ్యాపితంగా వ్యాపారస్ధులు బంద్ పాటించారు. రిటైల్ అమ్మకాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. న్యూఢిల్లీతో పాటు దేశ వ్యాపితంగా బంద్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఈ బంద్ లో పాల్గొంది. అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహించింది. బి.జె.పి శ్రేణులు ప్రధాన మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసాయి. రాజధాని ఢిల్లీలో కనీసం ఇరవై…

చిల్లర దుకాణాల కడుపు కొట్టడానికి సర్వం సిద్ధం

చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను…

ఎయిర్ ఇండియాకు బోయింగ్ విమానాలు అమ్మకుండా యు.ఎస్ ఎయిర్ లైన్స్ అడ్డుపుల్ల

వ్యాపార పోటీని అడ్డదారిలో అడ్డు తప్పించుకోవడం అమెరికా కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. చైనాతో గల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి వ్యాపార, వాణిజ్యాల్లో పోటిపడడం చేతగాని అమెరికా, చైనా తన కరెన్సీని అసహజంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని ఆరోపిస్తూ యువాన్ విలువను పెంచేలా ఒత్తిడి తెచ్చి, చైనా నుండి వస్తున్న దిగుమతులను తగ్గించుకుని, తన వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తున్నది. ఇప్పుడు బోయింగ్ విమానాలను ఇండియా కొనుగోలు చేయడానికి వీలుగా ఇండియా కంపెనీలకు, అమెరికాకి…

త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా

దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైన దృష్టి పెట్టకపోతే త్వరలో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు, ఆయిల్ దిగుమతుల బిల్లుని మించిపోవడం ఖాయమని భారత ప్రభుత్వ ఐ.టి సలహాదారు శ్యాం పిట్రోడా హెచ్చరించారు. ఎలక్ట్రానికిక్ మాన్యుఫాక్చరింగ్ లో పునాదిని విస్తృతపరుచుకోవడం కోసం ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలని పిట్రోడా తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతున్నదని కాని ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆ డిమాండ్ తట్టుకోవడానికి దిగుమతులపై…

డజను భారత సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తివేసిన పాకిస్ధాన్

త్వరలో భారత్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడానికి వీలుగా ప్రక్రియ ప్రారంభించడానికి అనుమతినిస్తూ పాకిస్ధాన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం, భారత్ నుండి వచ్చే 12 రకాల సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాటల వరకే కాదని నిరూపించుకుంది. పాకిస్ధాన్ శనివారం ఈ విషయం తెలిపింది. పాకిస్ధాన్ లో ‘ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ’ (ఇసిసి),…

అబ్బే, ఇండియాకి ఆ హోదాం మేం ఇవ్వలేదు -పాక్ ప్రధాని గిలాని

భారత్ అధికారుల అనుమానం నిజం అయ్యింది. ఇండియాకి తామింకా “అత్యంత అనుకూలమైన దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎఫ్) హోదా ఇవ్వలేదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని స్పష్టం చేశాడు. ఆ హోదా ఇవ్వడానికి చర్చలు జరిపడానికి ముందుకు కదలాల్సిందిగా ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ కు ఆదేశాలివ్వడం మాత్రమే జరిగిందని ఆయన శనివారం వెల్లడించాడు. “ఈ అంశంలో ముందడుగు వెయ్యాలని వాణిజ్య శాఖకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియాతో వాణిజ్యం విషయంలో చురుకుగా ఉన్న…

ఇండియాకు ‘అత్యంత అనుకూల దేశం’ హోదా ఇవ్వడానికి పాకిస్ధాన్ వెనకడుగు?

ఈ వారం ప్రారంభంలో ఇండియాకు, పాకిస్ధాన్ ప్రకటించిన ‘అత్యంత అనుకూల దేశం’ (మోస్ట ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎన్) హోదా ను మళ్ళీ చిక్కులో పడింది. దేశీయంగా తలెత్తిన అభ్యంతరాలతో ఇండియాకు ఎమ్.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ శుక్రవారం తెలిపింది. ఎం.ఎఫ్.ఎన్ హోదా ఉన్నట్లయితే కొన్ని వ్యాపార సంభంధిత ప్రయోజనాలను ఇండియా పొందగలుగుతుంది. ఇండియా, పాకిస్ధాన్ కు ఎన్నడో…

కూడూ, నీడా, చదువూ లేని ఫార్ములా 1 రేసు రోడ్డు నిర్మాతలు

ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో…

పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…

లిబియా ‘ఆయిల్ కేక్’ పంపకాలకు పశ్చిమ రాజ్యాలు సిద్ధం -కార్టూన్

లిబియా ఆయిల్ వనరుల్ని పంచుకోవడానికి పశ్చిమ రాజ్యాల ఆయిల్ కంపెనీలు ఇప్పుడు లిబియాలో చర్చల్లో మునిగితేలుతున్నాయి. తిరుగుబాటు ప్రారంభమైందని ప్రపంచానికి పూర్తిగా తెలియక ముందే తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్సుకు పెద్ద భాగం లభించింది. 34 శాతం ఆయిల్, గ్యాస్ వనరుల్ని ఫ్రెంచి కంపెనీ టోటల్ కి అప్పగిస్తున్నట్లుగా లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంకా అమెరికా (ఎక్సాన్ మొబిల్), ఇటలీ (ఇ.ఎన్.ఐ), రష్యా (గాజ్‌ప్రోమ్), బ్రిటన్ (బిపి), హాలండ్ (రాయల్ డచ్ షెల్), స్పెయిన్…

జగన్ అరెస్టు కావొచ్చు, ఆస్తులూ పోవచ్చు -న్యాయ నిపుణులు

దేవుడి పాలనలో ఒక వెలుగు వెలిగిన దైవ కుమారుడికి కష్టాలు వచ్చిపడ్డాయి. న్యాయ వ్యవస్ధ క్రియాశీలంగా మారడం వల్లనో లేదా అది తను నిజానికీ చేయవలసిన పని నిజాయితీగా చేస్తున్నందునో దొంగ దేవుళ్ళ పాపాల సామ్రాజ్యాలు కూలుతున్న  శబ్దాలు వినపడుతున్నాయి. అవి పాపాల రాయుళ్ళకు కర్ణ కఠోరంగా ఉంటే, ఆ పాపాలలో సమిధలయిన సామాన్య మానవునికి వీనులవిందుగా తోస్తోంది. న్యాయ నిపుణులు ‘ముందుంది మొసళ్ల పండగ’ అంటున్నారు. జగన్‌ పాల్పడ్డాడంటున్న నేరాలను బట్టి చూస్తే భవిష్యత్తులో జగన్…

సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని బళ్ళారి మైనింగ్ మాఫియా, ఖనిజం సీజ్

మాఫియాకి తీర్పులు, ఆదేశాలు ఒక అడ్డా? కోర్టుల తీర్పులు, ప్రభుత్వాల ఆదేశాలే దానికి అడ్డయితే అది మాఫియా కాదేమో! గత గురువారం బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను, రవాణాను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ బళ్ళారి నుండి 49 ట్రక్కులతో ఇనుప ఖనిజం రావాణా చేస్తూ బళ్ళారి వద్ద దొరికిపోయారు. బళ్ళారి శివార్లలో ఉన్న ఆలిఘర్ వద్ద ఇనుప ఖనిజాన్ని చట్ట విరుద్ధంగా రవాణా చేస్తుండగా జిల్లా…