రూపాయి విలువ పడిపోవడానికి యూరోపే కారణం -ఆర్ధిక మంత్రి

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ 15 శాతం పైగా పడిపోవడానికి కారణం యూరో జోన్ లోని వ్యవస్ధాగత సమస్యలేనని ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశాడు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనం అవుతుండడంతో దేశ దిగుమతుల బిల్లు తడిసి మోపెడయింది. యూరోజోన్ ఋణ సంక్షోభంతో పాటు కమోడీటీల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు అస్ధిరంగా మారడంతో ఇండియాతో పాటు ఇతర ఆసియా దేశాల్లో ‘చెల్లింపుల సమతూకం’ (Balance of Payment) ఒత్తిడికి గురవుతోందని ప్రణబ్…

స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

– “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి…

ఇంటర్నెట్ బందిపోటు దొంగ గూగుల్, మైనర్ పెనాల్టీతో వదిలేసిన ఎఫ్.సి.సి

ఇంటర్నెట్ వినియోగదారుల సమాచారాన్ని నాలుగేళ్లపాటు దొంగిలించిన గూగుల్ సంస్ధను అమెరికా ‘ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్’ (ఎఫ్.సి.సి) కేవలం $25,000 పెనాల్టీతో వదిలిపెట్టింది. తనకు తెలియకుండా జరిగిందని పదే పదే అబద్ధాలు చెప్పినా గూగుల్ ‘బందిపోటు దోపిడి’ ని లైట్ తీసుకుంది. వేరే అవసరం కోసం రాసిన ప్రోగ్రామ్ పొరబాటున స్ట్రీట్ వ్యూ ప్రోగ్రామ్ లో కలిసిందని పచ్చిగా నాటకాలాడినా ‘మరేం ఫర్వాలేదు’ పొమ్మంది. కార్పొరేట్ కంపెనీలు, ఫెడరల్ రెగ్యులేటర్ సంస్ధలు ఒకరినొకరు సహరించుకుంటూ అమెరికా ప్రజలను నిరంతరం…

ఎన్రికా లెక్సీ: ఇటలీ నౌక, సిబ్బంది వెళ్లిపోవడానికి సుప్రీం అనుమతి

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన కేసులో నౌకతో పాటు సిబ్బంది కూడా భారత దేశం నుండి వెళ్లిపోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల రూపాయల బాండు సపర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ భారతీయ కోర్టులకు హాజరు కావలసి ఉంటుందని కోర్టు ఇటలీ నౌక సిబ్బందికి షరతు విధించింది. కోర్టు సమన్లు జారీ చేసిన ఐదు నెలలలోపు సిబ్బంది కోర్టులకు హాజరు కావాలన్న…

స్విస్ ఖాతాల సమాచారం పొందడానికి నిబంధనలు సరళతరం

స్విస్ బ్యాంకుల్లో దొంగ సొమ్ము దాచిన భారతీయుల సమాచారం పొందడానికి ఇప్పటివరకూ ఉన్న నిబంధనలు మరింత సరళతరం అయ్యాయని భారత ప్రభుత్వం తెలియజేసింది. ‘బ్లాక్ మనీ’ పై భారత ప్రభుత్వం తలపెట్టిన పోరాటం తాజా పరిణామంతో ఊపందుకుంటుందని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రహస్య ఖాతాలున్న వ్యక్తుల సమాచారం స్విస్ ప్రభుత్వం మనకు ఇవ్వడానికి ఇకనుండి పేరు, చిరునామా పూర్తిగా ఇవ్వకపోయినా ఫర్వాలేదనీ, సమీప సమాచారం ఇస్తే సరిపోయే విధంగా నిబంధనలు సడలించారనీ ప్రభుత్వం తెలిపింది.…

ఎన్రికా లెక్సీ: కేరళను నిలదీసిన సుప్రీం కోర్టు

ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటాలియన్ నౌక రక్షణ బలగాలు కాల్చి చంపిన కేసులో కేరళ ప్రభుత్వ అవగాహనను సుప్రీం కోర్టు నిలదీసింది. నౌక యజమానులు, జాలర్ల కుటుంబాలు కుదుర్చుకున్న ‘రాజీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదని సుప్రీం కోర్టు బెంచి నిలదీసింది. “భారత న్యాయ వ్యవస్ధకే ఇది సవాలు లాంటిది. ఇది అనుమతించరానిది. అత్యంత దురదృష్టకరం” అని ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. ఒక్క కోటుంబానికి నౌక యజమానులు కోటి…

యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్

ఎలక్ట్రానిక్ గాడ్గెట్ల దిగ్గజం ‘యాపిల్’ ప్రపంచ వ్యాపితంగా చిన్న చిన్న ఆఫీసులు నెలకొల్పి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగవేసిందని ది న్యూయార్క్స్ టైమ్స్ శనివారం వెల్లడించింది. కాలిఫోర్నియా కంపెనీ అయిన ‘యాపిల్’ నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఆఫీసు పెట్టడం పన్ను ఎగవేతకు వేసిన ఎత్తుగడల్లో ఒకటని ఆ పత్రిక తెలిపింది. నెవాడాలో కార్పొరేట్ పన్ను సున్నా శాతం కాగా కాలిఫోర్నియాలో 8.84 శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తారని తెలిపింది. రెనో ఆఫీసు లాంటివి…

క్లుప్తంగా… 27.04.2012

ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా ఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…

మధ్య ప్రాచ్యం లో కీలక పరిణామం, ఇజ్రాయెల్ కి ఈజిప్టు గ్యాస్ సరఫరా రద్దు

మధ్య ప్రాచ్యం లో కొద్ది రోజుల క్రితం కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరాను ఈజిప్టు సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాదు, కేవలం కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీల వ్యవహారమేనని ఇరు ప్రహుత్వాలలోని కొన్ని వర్గాలు అంటున్నప్పటికీ, విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక సంస్కరణల’ కోసం జరిగిన తిరుగుబాటులో ఇజ్రాయెల్ కి సంవత్సరాల తరబడి అత్యంత చౌకగా…

విదేశీ గూఢచర్యానికి ‘వాణిజ్య ముసుగు’ కోసం అనుమతి కోరిన అమెరికా మిలట్రీ

విదేశాల్లో తాము సాగించే గూఢచార కార్యకలాపాలకు ‘వాణిజ్య ముసుగు’ కావాలంటూ అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ అనుమతి కోరింది. విదేశాలలో వాణిజ్యవేత్తల ముసుగులో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడడానికి అమెరికాకి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్’ (డి.ఒ.డి) అమెరికా కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు ఉంచిందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ వెబ్ సైట్ తెలిపింది. అమెరికా సైనికులను నేరుగా రంగంలోకి దించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందనీ, వాణిజ్య ముసుగులో రహస్య మిలట్రీ కార్యకలాపాల కోసం అనుమతి…

పొలాల్లో కూలిన పాక్ విమానం, 127 మంది దుర్మరణం

పాకిస్ధాన్ లో పాసింజర్ జెట్ విమానం ఒకటి పొలాల్లో కూలిపోయింది. అందులో ఉన్న సిబ్బందితో సహా ప్రయాణికులంతా దుర్మరణం పాలయ్యారని డాన్ పత్రిక తెలిపింది. పాక్ రక్షణ మంత్రి చౌదరి అహ్మద్ ముఖర్ మొత్తం 127 మంది మరణించారని ధృవీకరించినట్లుగా ఫస్ట్ పోస్ట్ పత్రిక తెలిపింది. భోజా ఎయిర్ జెట్ శుక్రవారం కరాచీ నుండి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి ప్రయాణిస్తుండగా విమానాశ్రయానికి కొద్ది కిలో మీటర్ల దూరంలో సరిగ్గా ల్యాండ్ అవడానికి సిద్ధపడుతుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది.…

అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా

ప్రపంచ దేశాల నుండి మమ్మల్ని ఒంటరి చేయాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందనీ కానీ ఆ శకం ముగిసిందనీ బొలీవియా అధ్యక్షుడు ‘ఇవా మొరేల్స్’ అన్నాడు. సంవత్సరాల తరబడి అమెరికా పెత్తనాన్ని ఎదుర్కొన్న లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నాయనీ, అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవనీ ‘ఇవా మోరేల్స్’ వ్యాఖ్యానించాడు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) సమావేశాలు సోమవారం ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాలు…

ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించింది

మార్చి 11, 2011 తేదీన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు కర్మాగారం సునామీ తాకిడికి ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల రేడియేషన్ సోకి ఉంటుందన్న అనుమానంతో జపాన్ ఎగుమతులను చాలా దేశాలు నిషేదించాయి. కూరగాయలు, చేపలు లాంటి ఉత్పత్తులని దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేశాయి. దానితో జపాన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావితం అయింది. అప్పటికే ‘ప్రతి ద్రవ్యోల్బణం’ తో సతమతమవుతున్న జపాన్ ఫుకుషిమా వల్ల మరోసారి మాంద్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఫుకుషిమా ప్రమాదం…

భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

తమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు…