ఇక భారత షేర్ మార్కెట్లతో విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఆడుకోవచ్చు
భారత దేశ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ వ్యక్తిగత మదుపుదారులే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించబోతోంది. జనవరి 15 నుండి విదేశీ మదుపరులను షేర్ మార్కెట్లలోకి అనుమతించనున్నట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను సరళీకరణకు గురిచేసే పధకంలో ఇది మరొక అడుగు. 2011 సంవత్సరంలో షేర్ మార్కెట్లనుండి విదేశీ సంస్ధాగత నిధులు పెద్ద ఎత్తున తరలివెళ్ళిన నేపధ్యంలో ఈక్విటీ మార్కెట్ నిబంధనలను మరింత సరళీకృతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.…