ఎఫ్.డి.ఐల దోపిడీ, భారతీయ పాలకులు మేధావుల సహకారం

మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే.

డాలర్లు: ఇండియాకి వచ్చేదాని కంటే పోయేది రెట్టింపు

మన ప్రధాన మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళరిగేలా తిరిగి దేశానికి రప్పించుకునే పెట్టుబడుల వల్ల ఎవరికీ లాభం కలుగుతోంది? ఆర్.బి.ఐ లెక్కల ప్రకారం చూస్తే దేశంలోకి వస్తున్న డాలర్ పెట్టుబడుల కంటే దేశం దాటి పోతున్న లాభాల డాలర్లే అధికంగా ఉంటున్నాయి.