భారత ఆర్ధిక వ్యవస్ధ, మన్మోహన్ వ్యర్ధ ప్రయత్నం -కార్టూన్

భారత ఆర్ధిక వ్యవస్ధకు చేసిన జబ్బుకి మళ్ళీ ఎఫ్.డి.ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మందు వేయడానికి మన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను వృద్ధి చేసుకోడానికీ, ప్రమాదకరంగా ఉన్న కరెంటు ఖాతా లోటును స్ధిరీకరించడానికి ఎఫ్.డి.ఐలు తప్ప మరో మార్గం లేదని భారత ప్రభుత్వంలోని ఆర్ధిక పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల అభ్యంతరాలతో నిమిత్తం లేకుండా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్…

రక్షణ సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం ఇండియా పన్నులన్నీ రద్దు చేయాల్సిందే -అమెరికా

రక్షణ రంగం, ఉన్నత సాంకేతిక రంగాలలో అమెరికా సహకారం కావాలంటె ఇండియా విదేశీ పెట్టుబడులపై అన్ని రకాల అడ్డంకులను ఎత్తివేయక తప్పదని అమెరికా అధికారి ఒకరు ప్రకటించాడు. ఇండియా తన రక్షణ రంగంతో పాటు ఉన్నత సాంకేతిక రంగంలో కూడా నూతన పరిజ్ఞానం కావాలని కోరుకుంటున్నదనీ, అది జరగాలంటే ముందు ఇండియా విదేశీ పెట్టుబడులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ ప్రక్రియలను సరళతరం చేయవలసిన అవసరం ఉందని…

మే నెలలో 111 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 111 శాతం పెరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఒక్క మే నెలలోనే ఎఫ్.డి.ఐ లు 4.66 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని ప్రభుత్వం సంబరంగా ప్రకటించింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో వచ్చిన 2.21 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లతో పోలిస్తే 111 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది. అంతే కాక గత 11 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద మొత్తం…