మణిపూర్ ఇండియా వలసలా ఉంది తప్ప రాష్ట్రంలా లేదు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి వ్యతిరేకత ఉత్తుత్తిదే -అద్వానీ (వికీలీక్స్)

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో అమెరికా ఇండియా లమధ్య కుదిరిన అణు ఒప్పందం పై బిజేపి తెలిపిన వ్యతిరేకత నిజానికి ఉత్తుత్తిదే అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఎల్.కె.అద్వానీ అమెరికా రాయబారికి చెప్పిన విషయం వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటికి కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. 2009 పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఫలితాలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అమెరికా రాయబారి కార్యాలయం చార్జి డి’ ఎఫైర్స్ పీటర్ బర్లే (రాయబార కార్యాలయంలో ముగ్గురు ముఖ్య రాయబారులు ఉంటారు…

అమెరికా విషయంలో బిజెపి ది రెండు నాల్కల ధోరణి -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి చేసిన తీవ్ర విమర్శలు నిజానికి అంత తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిజేపి నాయకులే చెప్పిన సంగతిని అమెరికా రాయబారి కేబుల్ ద్వారా బయట పడింది. బిజేపి ది రెండు నాల్కల ధోరణి అనీ అమెరికాతో ఒప్పందాలపై బిజేపి ప్రకటించే వ్యతిరేకత అధికారం కోసమే తప్ప అందులో నిజం లేదని భారత దేశంలో ఎం.ఎల్ పార్టీలు చెప్పడం వాస్తవమేనని వికీలీక్స్ లీక్ చేసిన అమెరికా రాయబారుల కేబుళ్ళ ద్వారా ఇప్పుడు…

వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ నిజమైనవే -రాయబారి మల్ఫోర్డ్

అమెరికా రాయబారులు రాసినవంటూ వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ లోని సమాచారాన్ని నమ్మలేమని పార్లమెంటులో ప్రకటించిన భారత ప్రధాని కి సమాధానం దొరికింది. అసలు వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ అసలు ఉన్నాయా లేదో కూడా రుజువులు లేవన్న మన్మోహన్ అనుమానానికి కూడా సమాధానం దొరికింది. సమాధానం ఇచ్చిన వారు ఎవరో కాదు. 2004 నుండి 2009 ఫిబ్రవరి వరకూ ఇండియాలో అమెరికా రాయబారిగా పనిచేసి ఇండియా పై తాను సేకరించిన సమాచారాన్ని కేబుల్స్ గా పంపిన డేవిడ్ సి.…

ఇండియా యాంటీ-టెర్రరిస్టు సంస్ధ వివరాలను ఎఫ్.బి.ఐ కి నివేదించిన చిదంబరం -వికీలీక్స్

బొంబాయిలోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడి జరిగిన తర్వాత ఆగమేఘాలమీద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టు చర్యల పరిశోధనా సంస్ధ “నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ – ఎన్.ఐ.ఏ” (జాతీయ పరిశోధనా సంస్ధ) గురించి అమెరికా ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంటు అయిన ఎఫ్.బి.ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారికి వివరించినట్లుగా వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశమయిన భారత దేశానికి హోం మంత్రిగా ఉంటూ,…

వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్

యు.పి.ఏ – 1 ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణను భారత ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. మా ప్రభుత్వం లో ఎవరూ ఆ సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటుకు చెప్పాడు. ప్రతిపక్షాలు “ఊహాత్మక, నిర్ధారించని, నిర్ధారించలేని” ఆధరాలతో ఆరోపణలు చేస్తున్నాయని సభకు తెలిపాడు. గురువారం సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మన్మోహన్ “వికీలీక్స్” సంస్ధ నమ్మదగినది కాద”ని అన్నాడు. “అసలు వికీలీక్స్ ఉనికినే ప్రభుత్వం గుర్తించడం లేదని…

శనివారం జపాన్ అణువిద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

భూకంపం, సునామీల దెబ్బకు పేలిపోయి అణు ధార్మికత వెదజల్లుతూ ప్రమాదకరంగా పరిణమించిన జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లకు శనివారం విద్యుత్ పునరుద్ధరించగలమని జపాన్ తెలిపింది. భూకంపం సునామీల వలన రియాక్టర్లకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్ధ పని చేయడం మానివేసింది. దానితో రియాక్టర్లలోని ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయే పరిస్ధితి తలెత్తింది. వాటిని చల్లబరచడానికి జపాన్ రెండు రోజులనుండి వాటర్ కెనాన్ ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా సముద్రపు నీటిని…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 3

ఇరాన్ విషయంలో ఇండియా అమెరికాకి అనుకూలంగా ఓటు వేయడం సరైందా, కాదా, అన్న అనుమానాల భారత సీనియర్ అధికారులను వెంటాడిన విషయం డిసెంబరు 15, 2005 నాటి కేబుల్ బయటపెట్టింది. విదేశీ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కె.సి.సింగ్ వ్యాఖ్యలు కేబుల్ లో ఉదరించబడ్డాయి. ఈయన సెప్టెంబరు 2005లో ఇండియా తరపున ఇరాన్ లో రాయబారిగా ఉన్నాడు. అమెరికా భావించినట్టుగా ఇరాన్ పై ప్రభావం పడేయడానికి ఇండియాకు ఇక ఏ మాత్రం అనుకూలత లేదని కె.సి.సింగ్…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 2

తర్వాత నవంబరులో జరిగిన ఐ.ఏ.ఇ.ఏ సమావేశంలో ఇరాన్ పై ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. సీక్రెట్ వర్గీకరణతో డిసెంబరు 12 న పంపిన కేబుల్లో అమెరికా రాయబారి ఇరాన్-ఇండియా ల విషయం లేవనెత్తాడు. “మధ్యప్రాచ్యం కి సంబంధించి సమగ్రమైన విధానం రూపొందించుకోవడంలో ఇండియా సమర్ధతను చూపలేక పోయింది” అని రాశాడు. (ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వరకు ఉన్న అరబ్, ముస్లిం దేశాలను కలిపి ‘మధ్యప్రాచ్యం’ గా సంభోధిస్తారు.) అంటే అమెరికా, ఇజ్రాయెల్ లకు అనుకూలంగా విదేశీ…

ఇండియా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన మన్మోహన్ అమెరికాల సంబంధం – 1

మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యు.పి.ఏ కూటమి అధికారం చేపట్టినప్పటినుండీ అమెరికా దోస్తీ కోసం ఇండియా వెంపర్లాడింది. అమెరికాతో “వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం” కుదుర్చుకోవడం వలన భారత ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం వికీలీక్స్ బయట పెట్టిన “డిప్లొమేటిక్ కేబుల్స్” ద్వారా వెల్లడవుతున్నది. అమెరికా, తన ప్రయోజనాలను నెరవేర్చడం కోసం తన రాయబారుల ద్వారా, ఐ.ఏ.ఇ.ఏ, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికల ద్వారా ఇండియాపై నిరంతరం ఎలా ఒత్తిడి చేసిందీ తెలుసుకుంటున్న కొద్దీ ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అమెరికా…

ఇటలీ అమెరికా సంబంధాలను దెబ్బతీసిన ఇండియా శాటిలైట్ ప్రయోగం -వికీలీక్స్

ఇండియాలో మానవ నిర్మిత ఉపగ్రహాన్ని (శాటిలైట్) ప్రయోగిస్తే అది ఇటలీ, అమెరికాల సంబంధాలను సంవత్సరం పాటు వేడెక్కించింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఇటలీ అమెరికాల సంబంధాల బలం ఇండియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట లో నిక్షిప్తం అయి ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇటలీలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికీ, ఇండియాలోని అమెరికా రాయబారికీ మే 26, 2007 తేదీన పంపిన కేబుల్ లో ఈ వివరాలు ఉన్నాయి. ఏప్రిల్ 23, 2007…

అమెరికా మేలు కోసం కేబినెట్ మంత్రుల్ని మార్చిన భారత ప్రధాని -వికీలీక్స్

“భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కేబినెట్ మంత్రులను నియమించడం, మార్చడం చేస్తున్నాడు” ఇది ఏ వామపక్షాలో, విప్లవకారులో చేసిన ఆరోపణ కాదు. ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితుడైన డేవిడ్ మల్ఫోర్డ్ అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిన ఓ కేబుల్ (టెలిగ్రాం ఉత్తరం) సారాంశం. భారతదేశ విప్లవ పార్టీలు భారత పాలకులు భారత ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమకు ఎంగిలి మెతుకులు విసిరే విదేశీ పాలకుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని…

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ సర్వసాధారణం -వికీలీక్స్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నోట్లతో ఓట్లు కొనడం సర్వసాధారణమని అమెరికా డెప్యుటీ రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి పంపిన కేబుల్ లో పేర్కొన్నాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు డబ్బులు పంచామని రాయబారి దగ్గర అంగీకరించినట్లుగా వికీలీక్స్ బైట పెట్టిన కేబుల్ ద్వారా తెలిసింది. నోట్లే కాకుండా వినియోగ సరుకులు, సేవలు కూడా ఓట్ల సంపాదనకి వినియోగించారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఏక్టింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేసిన…

‘ది హిందూ’ చేతిలో ఇండియాకి సంబంధించిన ‘వికీ లీక్స్’ డాక్యుమెంట్లు

అమెరికా తరపున ప్రపంచవ్యాపితంగా నియమించబడిన రాయబారులు తాము నియమించబడిన దేశాల్లో గూఢచర్యం నెరుపుతూ సంపాందించిన వివరాలను కేబుల్ ద్వారా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు పంపిస్తారు. 1960 నుండి 2010 ఫిబ్రవరి వరకూ అలా పంపిన కేబుల్స్ ‘వికీ లీక్స్’ సంస్ధకు అందిన విషయం తెలిసిందే. వికీ లీక్స్ సంస్ధ తనకు అందిన ‘డిప్లొమాటిక్ కేబుల్స్’ ను 2010 నవంబరు నెలాఖరు నుండి తన వెబ్ సైట్ లో ప్రచురిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఇండియాకు…