ఇండియా చైనాల మధ్య 9 ఒప్పందాలు

చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ చైనాతో ఏకంగా 9 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాణిజ్య పరమైన ఒప్పందాలు మాత్రం ఏదీ కుదిరినట్లుగా పత్రికల్లో సమాచారం లేదు. అయితే తన చైనా పర్యటన గొప్పగా విజయవంతం అయినట్లు ప్రధాని ప్రకటించిచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించారని, ఆయనను సంతోష పెట్టడానికి చైనా పెద్దలు వివిధ రకాలుగా ప్రయత్నించారని పత్రికలు రాశాయి. సరిహద్దు తగాదాల విషయంలో ఇరు దేశాలలో ఏదీ అవతలివారిపై మిలట్రీ…

ఘర్షణ వైపు నడుస్తున్న భారత్-చైనా సంబంధాలు?

  భారత్-చైనా సంబంధాలు మరొకసారి ఘర్షణాత్మక వైఖరిలోకి ప్రవేశించాయి. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశలో ఇరు దేశాలు కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు ఒక్కసారిగా రద్దు కానున్నాయా అన్న అనుమానం కలిగే వైపుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ సరిహద్దు లో తిరిగి యధాతధ స్ధితిని తీసుకురావాలని భారత ప్రభుత్వం మంగళవారం చేసిన ప్రకటన పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘దౌలత్ బేగ్ ఓల్డి’ సెక్టార్ లో చైనా బలగాలు 10 కి.మీ దూరం…