మోడి ప్రసంగం కేన్’సెల్’ -కార్టూన్

‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘, మోడి ప్రసంగం రద్దు చేయడం వలన ఎవరికి మేలు జరిగినట్లు? మార్చి 22-23 తారీఖుల్లో ఫిలడెల్ఫియా లో జరగనున్న ఫోరం సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని నరేంద్ర మోడిని ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ ఆహ్వానించింది. కానీ ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా‘ లోని కొందరు విద్యార్ధులు, బోధన సిబ్బంది మోడికి ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002లో ముస్లిం ప్రజలపై జరిగిన అమానుష హత్యాకాండ దరిమిలా అమెరికా ప్రభుత్వమే మోడీకి…