85 ధనికుల సంపద = 350 కోట్ల మంది సంపద

పెట్టుబడిదారీ వ్యవస్ధల ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వార్త! ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో మొట్ట మొదటి 85 మంది సమాజ సేవలో తరించిపోతున్నారు. ఎంతగా తరించిపోతున్నారంటే వారి సంపదలు కింది భాగంలో ఉన్న 350 కోట్ల మంది సంపదలతో సమానం అయ్యేంతగా. వీరి ప్రజా సేవ వల్ల తమ సంపదలు అంతులేకుండా పెరిగిపోతుంటే వీరి సేవలు అందుకుంటున్న సోమరిపోతుల సంపద మాత్రం తీవ్రంగా తరిగిపోతోంది. ఈ 85 మంది గత జన్మలో ఎంతటి పుణ్యం చేసుకున్నారో తెలిసే మార్గం…

త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా

దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైన దృష్టి పెట్టకపోతే త్వరలో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు, ఆయిల్ దిగుమతుల బిల్లుని మించిపోవడం ఖాయమని భారత ప్రభుత్వ ఐ.టి సలహాదారు శ్యాం పిట్రోడా హెచ్చరించారు. ఎలక్ట్రానికిక్ మాన్యుఫాక్చరింగ్ లో పునాదిని విస్తృతపరుచుకోవడం కోసం ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలని పిట్రోడా తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతున్నదని కాని ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆ డిమాండ్ తట్టుకోవడానికి దిగుమతులపై…