లోకాయుక్త హెగ్డె క్షమాపణ చెప్పాలి -రెడ్డి బ్రదర్ డిమాండ్

రెడ్డి బ్రదర్స్ లలో ఒకరైన కర్ణాటక రెవిన్యూ మంత్రి కరుణాకర రెడ్డి తనపైన అక్రమ మైనింగ్ ఆరోపణలు చేసినందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తనపైన లోకాయుక్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందున క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు  ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైకెక్టరుగా తాను 2004 లోనే రిటైర్ అయ్యాననీ, ఆ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రికార్డులు కూడా ఉన్నాయనీ కరుణాకర రెడ్డి తెలిపాడు.…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…