గడ్డాఫీ అమ్ములపొదిలో క్లస్టర్ బాంబులు, హక్కుల సంస్ధ ఆందోళన

లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు…

లిబియా దాడులపై అమెరికా, ఫ్రాన్సులకు దొరకని మద్దతు

లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిస్తాం -పశ్చిమ దేశాలు

లిబియా ఆయిల్ వనరులను పూర్తిగా తమకు అప్పగించడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీని గద్దె దించడానికి పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్ లు లిబియా తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యారు. లిబియా పై ఐక్యరాజ్యసమితి ఆయుధ రవాణా నిషేధం విధించినప్పటికీ పశ్చిమ దేశాలు దాన్ని పట్టించుకోదలచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1970 వ తీర్మానం ద్వారా లిబియాలోని ఇరు పక్షాలకు ఆయుధాలు సహాయం చేయకుండా, అమ్మకుండా నిషేధం విధించింది. 1973 వ తీర్మానం ద్వారా లిబియాలో పౌరల రక్షణకు అవసరమైన…

సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో లిబియా విప్లవం

విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది. సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు…

లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

లిబియా తిరుగుబాటు బలగాల ఉసురు తీస్తున్న పశ్చిమదేశాల దాడులు

లిబియాపై పశ్చిమ దేశాల దాడులు వాటిని సహాయం కోసం పిలిచిన వారినే చంపుతున్నాయి. బుధవారం అజ్దాబియా పట్టణం నుండి వెనక్కి వెళ్తున్న తిరుగుబాటు బలగాలపై పశ్చిమ దేశాలు నాలుగు క్షిపణులను పేల్చడంతో కనీసం 13 మంది చనిపోగా మరింతమంది గాయపడ్డారని బిబిసి తెలిపింది. లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తూర్పు లిబియాలో తిరుగుబాటు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వారిపై వైమానికి బాంబుదాడులు చేస్తూ పౌరులను కూడా గడ్డాఫీ చంపుతున్నాడనీ పశ్చిమ దేశాలు నిందించాయి.…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వానికి మరిన్ని దేశాల గుర్తింపు, మొదలైన ఆయిల్ ఎగుమతులు

లిబియా తూర్పు ప్రాంతంలో పెద్ద పట్టణమైన బెంఘాజీ కేంద్రంగా ఏర్పదిన తాత్కాలిక తిరుగుబాటు ప్రభుత్వం (లిబియా జాతీయ కౌన్సిల్) మరిన్ని దేశాల గుర్తింపును పొందింది. కౌన్సిల్ ఏర్పడడంతోనే ఫ్రాన్సు గుర్తించిన సంగతి విదితమే. ఫ్రాన్సు, బ్రిటన్ లు కాలికి బలపం కట్టుకుని మరీ యూరోపియన్ దేశాలను కోరినప్పటికీ అవి తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కు ఆర్ధికంగా నాయకత్వం వహిస్తున్న జర్మనీ తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడానికి గట్టిగా నిరాకరించింది. పశ్చిమ దేశాలు లిబియాపై…

పశ్చిమదేశాల విమాన దాడుల్లో లిబియా పౌరుల దుర్మరణం

పశ్చిమ దేశాల రక్తదాహానికి అంతులేకుండా పోతోంది. ఇరాక్ పై దాడికి ముందుగానే ఆంక్షల పేరుతో లక్షలాది ఇరాకీ పసిపిల్లల ఉసురు పోసుకున్నాయి. పసిపిల్లల పాల డబ్బాల రవాణాపై కూడా ఆంక్షలు విధించడంతో పోషకార లోపంవలన లక్షలాదిమంది ఇరాకీ పిల్లలు చనిపోయారు. సంవత్సరాల తరబడి విచక్షణా రహితంగా బాంబు దాడులు చేసి లక్షలమంది రక్తమాంసాల్ని ఆరగించాయి. ఆఫ్ఘనిస్తాన్ పై దురాక్రమణ దాడి చేసి మిలియన్లమంది పౌరులను చంపిన సంగతి వికీలీక్స్ బైట పెట్టిన ఆఫ్ఘన్ యుద్ధ పత్రాల ద్వారా…

లిబియా తిరుగుబాటుదారులకు రహస్య ఆయుధ సాయానికి ఒబామా ఆదేశం

అనుకున్నంతా అయ్యింది. అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ లిబియా తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించడానికి నిర్ణయించాడు. అమెరికా ప్రభుత్వ అధికారులు కొందరిని ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ ఈ వార్త ప్రచురించింది. తిరుగుబాటుదారులకు రహస్యంగా ఆయుధాలు అందించే రహస్య ఉత్తర్వుపై ఒబామా సంతకం చేశాడని ఆ సంస్ధ తెలిపింది. గత కొద్ది వారాల్లో “ప్రెసిడెన్షియల్ ఫైండింగ్’ అని పిలవబడే ఆదేశంపై ఒబామా సంతకం చేశాడు. సీఇఏ చేపట్టే అటువంటి రహస్య కార్యకలాపాలకు చట్టపర ఇబ్బందులు ఎదురు కాకుండ…

మళ్ళీ పురోగమిస్తున్న గడ్డాఫీ బలగాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమించే దిశలో పశ్చిమ దేశాలు

గడ్డాఫీ బలగాల ధాటికి లిబియా తిరుగుబాటు బలగాలు మళ్ళీ వెనక్కి పారిపోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడుల మద్దతు లేకుండా తిరుగుబాటు బలగాలు పురోగమించడం అసాధ్యమని స్పష్టమై పోయింది. గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన పౌర సైన్యానికి శిక్షణ కొరవడడంతో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్ని నిలబెట్టుకోలేక పోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడులతో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరుగుబాటు దారులు వదిలిపెట్టి తూర్పువైపుకు పారిపోతున్నాయి. దీనితో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ తిరుగుబాటు బలగాలకు ఆయుధ సాయం…

గడ్డాఫీకి మద్దతుగా లిబియా ప్రజలు?

  Retreating rebels in Libya పశ్చిమ దేశాల వైమానిక దాడులు లేకుండా లిబియా తిరుగుబాటు బలగాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. మంగళవారం లండన్ లో లిబియా విషయమై ప్రపంచ దేశాల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ లోపల సిర్టే పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటు బలగాలపై గడ్డాఫీ బలగాలు భారీగా దాడి చేశాయి. దానితో లిబియా తిరుగుబాటు దారులు సిర్టే పట్టణం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు వదిలేసి తూర్పువైపుకు పలాయనం ప్రారంభించారు. సిర్టే పట్టణ…

పశ్చిమ దేశాల దాడుల్లో వందకు పైగా లిబియన్ల మరణం, కొనసాగుతున్న దురాక్రమణ దాడులు

లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేసే పేరుతో పశ్చిమ దేశాల యుద్ద విమానాలు విచక్షణా రహితంగా చేస్తున్న దాడుల్లొ ఇప్పటికి వందకు పైగా లిబియా పౌరులు మరణించినట్లు లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం గడ్డాఫీకి చెందిన భూతల సైనిక దళాలపై దాడులకు అనుమతి ఇవ్వలేదనీ, అయినా పశ్చిమ దేశాలు గడ్డాఫీ సైనికులపై వైమానిక దాడులు చేస్తుండడం ఆమోదనీయం కాదనీ రష్యా విదేశాంగ మంత్రి “సెర్గీ లావరోవ్” రాయిటర్స్ వార్తా సంస్ధతో మట్లాడుతూ అన్నాడు. గడ్డాఫీ…

సంకీర్ణ సేనల దాడుల సాయంతో కీలక పట్టణం తిరుగుబాటుదారుల స్వాధీనం

పశ్చిమ దేశాల సంకీర్ణ సేనల భారీగా దాడులు చేస్తుండడంతో గడ్డాఫీ బలగాలు కీలకమైన అజ్దాబియా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. లిబియా తూర్పు ప్రాంతానికి ముఖ ద్వారంగా చెప్పుకునే అజ్దాబియా కోల్పోవడంతో గడ్డాఫీ బలగాల పురోగమనం ఆగిపోయినట్లే. దాదాపు రెండు వారాలనుండి తిరుగుబాటుదారుల నుండి ఒక్కొక్క పట్టణాన్నీ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న గడ్డాఫీ బలగాలకు పశ్చిమ దేశాల సైనిక చర్య గట్టి దెబ్బ తీసింది. తిరుగుబాటుదారుల ప్రతిఘటన కారణంగా కాకుండా పశ్చిమ దేశాల దాడుల వలన అజ్దాబియాని చేజిక్కించుకున్న…

తొత్తు అరబ్ ప్రభుత్వాల మద్దతుతో లిబియాపై దాడికి ‘నాటో’ నాయకత్వం

తమ మాట వినే అరబ్ దేశాల మద్దతుతొ లిబియాపై జరుపుతున్న దాడులకు ఆమోద యోగ్యత సాధించడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మొదట లిబియాపై సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన కతార్ ఇప్పటికే దాడుల్లో పాల్గొంటున్నది. తాజాగా టర్కీ కూడా కతార్ తో జత కలిసింది. “అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక ఉచ్యమాలు తలెత్తడానికి పశ్చిమ దేశాలు అరబ్ దేశాల పట్ల అనుసరిస్తూ వచ్చిన విధానాలే కారణమ”ని హెచ్చరించిన టర్కీ ఇప్పుడు నో-ఫ్లై అమలుకు నాటొ నాయకత్వానికి అంగీకరించింది. గురువారం…