లడఖ్ లో చొరబాటు వార్తలను తిరస్కరించిన చైనా
తూర్పు లడఖ్ ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర చైనా సాయుధ బలగాలు ఇండియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయన్న వార్తలని చైనా ఖండించింది. వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) కు సంబంధించి ఇండియాతో కుదిరిన ఒప్పందాలను తాము అతిక్రమించబోమని, తమ సైనికులు రేఖను దాడి వెళ్లలేదని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సరిహద్దులో భారత ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రక్షణ మంత్రి ఆంటోని ప్రకటించాడు.…