ఎఎపి పాలన: షీలాపై ఎఫ్.ఐ.ఆర్
మొదటి వేటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పైనే పడింది. సి.ఎం అరవింద్ ఆదేశం అందుకున్న రోజే ఢిల్లీ ఎ.సి.బి రంగంలోకి దిగింది. వీధి దీపాల కుంభకోణంలో మాజీ సి.ఎం షీలా దీక్షిత్ పై ఎ.సి.బి, ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. 2010లో కామన్వెల్త్ ఆటల పోటీలు ఢిల్లీలో జరిగిన సందర్భంగా చేపట్టిన వీధి దీపాల నిర్మాణం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని షుంగ్లు కమిటీ తేల్చింది. కమిటీ పరిశీలనలను షీలా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త…
