మన్మోహన్: రాహుల్ గాంధీ బరువు తూచే యంత్రం?

అధికారం, హోదా అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయని/చేయలేని వ్యక్తిని ‘ఉత్సవ విగ్రహం’గా చెప్పుకోవడం పరిపాటి!అవడానికి ప్రధమ పౌరుడే అయినా ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలూ లేని, కేవలం కేంద్ర మాంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాలపైన సంతకం మాత్రమే పెట్టగల రాష్ట్రపతిని ‘రబ్బర్ స్టాంప్’ గా సంభోధించడమూ తెలిసిందే. ప్రధాన మంత్రి పదవి వీటికి భిన్నం. అది భారత దేశంలో అత్యున్నత అధికారం కలిగిన పదవి. ఆ పదవిని అమెరికా కంపెనీలకు తప్ప భారత దేశ ప్రజలకు ఉపయోగించని మన్మోహన్…

ఆహా రాహుల్! ఏమి మీదు నాటకంబు?

“కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు” ఇది మన రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేష్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్య. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ధనిక రాజకీయవేత్తలకు వర్తించేది మాత్రమే’ అన్న నిర్వచనం ఏమన్నా ఉన్నట్లయితే ఆయన చెప్పిందాంట్లో సందేహం అనేదే లేదు. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వమే హడావుడిగా ఒక ఆర్డినెన్స్ తయారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, మరోపక్క ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే, తమ పార్టీలోని మరోనేత ఆ…

యువరాజా నాయకత్వ విలువ! -కార్టూన్

ఉల్లి, తదితర ఆహార సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయి? తరుగు ఉత్పత్తిని పసిగట్టిన వ్యాపారులు సదరు సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమంగా ధరలు పెంచి తద్వారా లబ్ది పొందాలని చూసినపుడు వాటి ధరలు పెరుగుతాయి. ఇది పై నుండి కింది వరకూ అందరికీ తెలిసిన నిజమే. ఈ సంగతి తెలిసి కూడా ధరల పెరుగుదల పైన ప్రధాని తదితర ఢిల్లీ నాయకుల నుండి ఛోటా మోటా గల్లీ నాయకుల వరకు ధరల పెరుగుదల పైన ఒకటే…

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి -కార్టూన్

భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చేప్పలేదు. తాము ఇంకా నిర్ణయించుకోలేదని బి.జె.పి అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ ఇతర నాయకులు మాత్రం నరేంద్ర మోడియే ప్రధాని అభ్యర్ధి అని బహిరంగంగానే చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడి అని చెప్పని నాయకుడు బి.జె.పిలో లేరు. హైద్రాబాద్ లో న.మో సభ పెట్టి దానికి రు. 5/- టికెట్ పెట్టే వరకూ బి.జె.పి నాయకులు వెళ్లారు. అదేమంటే ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం…

సొంత డబ్బాకు అమ్మ, నాయనమ్మలు కావాలా?

— “…తనకు నాయకత్వ సామర్ధ్యం ఏ మాత్రం ఉందో కనిపెట్టడానికి రాహుల్ జీ ప్రయత్నిస్తున్నట్లున్నారు…” — కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాక రాహుల్ గాంధీ తన మొట్టమొదటి పార్టీ అధికారిక పర్యటనకు ఢిల్లీనే ఎంచుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని గురువారం సందర్శించిన రాహుల్ గాంధీ తాను క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని చెప్పారు. అంతవరకు సంతోషమే. కానీ అలా చెప్పడానికి తన అమ్మగారు, నాయనమ్మ గారిని అడ్డం పెట్టుకోవడమే ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. తాను తన అమ్మగారు…

మన్మోహన్ ప్రభుత్వానికి ఫుల్ మార్కులా? -కార్టూన్

కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ తానే ప్రధాన మంత్రి కావొచ్చని మన్మోహన్ చెప్పినట్లు ఈ మధ్య పత్రికలు గుసగుసలాడాయి. బ్రిక్స్ సమావేశం నుండి తిరిగొస్తూ విమానంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఇచ్చిన అస్పష్ట సమాధానం ఈ గుసగుసలకు కారణం. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఊహాగానాలకు బదులివ్వను అని చెబుతూనే ‘బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాక దాన్ని ఎలా దాటాలనేది ఆలిచిస్తాం” అన్నారు. దానర్ధం మళ్ళీ ప్రధాని పదవి ఆయన కోరుతున్నట్లే…

రాహుల్ గాంధీ ఎందుకు కేంద్ర మంత్రి కాలేడు? -కార్టూన్

రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం ఇవ్వాలనీ, ఆయనకి ప్రభుత్వంలో కూడా నాయకత్వ పదవి అప్పజెప్పాలనీ కాంగ్రెస్ లో అనేకమంది చాలా కాలంగా శతపోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడల్లా ఈసారి రాహుల్ కి సముచిత పదవి తధ్యమని కాంగ్రెస్ పెద్దలతో పాటు, పత్రికలు కూడా ఊహాగానాలు చేయడం ఒక రొటీన్ గా ఉంటూ వచ్చింది. 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తాజా విస్తరణలో కూడా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో స్ధానం పొందలేదు. ఎప్పటికప్పుడు…

రాహుల్ పట్టాభిషేకం సమస్య ఎవరిది? -కార్టూన్

భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో,…

నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం…