ఎ.పి అసెంబ్లీ ఆటంకం దాటిన టి.బిల్లు -కార్టూన్
ఎన్.డి.ఎ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఉత్తర ఖండ్. ఈ రాష్ట్రాల ఏర్పాటు నల్లేరుపై నడకలాగే సాగింది. ఆ ప్రాంతాల మూల రాష్ట్రాల అసెంబ్లీలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం దానికొక కారణం. అక్కడ అభ్యంతరం చెప్పకపోవడానికీ, ఇక్కడ తీవ్ర అభ్యంతరం చెప్పడమే కాకుండా ఆందోళనలు కూడా జరగడానికి కారణం ఏమిటి? బి.జె.పి పార్టీ దానికి కారణం కాంగ్రెస్ వ్యవహరించిన పద్ధతి అని ఆరోపిస్తోంది. ‘మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది’ అని వెక్కిరిస్తోంది. ‘ప్రశాంతంగా పాత…

