సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…

దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…

మంత్రివర్గం పొందిక మార్కెట్లకు నచ్చలేదుట!

నరేంద్ర మోడి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఆగమనంతో మురిసిపోయిన విదేశీ (and hence స్వదేశీ) కంపెనీలు మంత్రి వర్గ నియామకాలు చూసి జావగారిపోయాయి. మార్కెట్ లకు ఈ మంత్రివర్గ పొందిక నచ్చలేదని మార్కెట్ విశ్లేషణ సంస్ధలు తేల్చిపారేశాయి. ఏనుగు మీద అదేదో ముతక సామెత చెప్పినట్లు అయిందే అని మార్కెట్లు వాపోతున్నాయిట. స్విట్జర్లాండ్ కి చెందిన బహుళజాతి ఆర్ధిక, ద్రవ్య సేవల సంస్ధ క్రెడిట్ సుసి, రాయిటర్స్ వార్తా సంస్ధ నిర్వహించే ‘మార్కెట్ ఐ’ శీర్షికలు సంయుక్తంగా…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.…