ఓటెయ్యడానికి వచ్చి చిరంజీవికి పాఠం చెప్పిన ఎన్.ఆర్.ఐ

పలు సినిమాల్లో విలన్లకు సంస్కారం, పౌర బాధ్యత తదితర సుగుణాల గురించి పాఠాలు చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి నిజ జీవితంలో తానే ఓ పౌరుడితో పాఠం చెప్పించుకున్నారు. పాఠం చెప్పింది కేంబ్రిడ్జిలో ఉద్యోగం చేస్తున్న ఎన్.ఆర్.ఐ కావడం విశేషం. కేవలం ఓటు వేయడం కోసమే లండన్ నుండి వచ్చిన కార్తీక్ గంటన్నర నుండి క్యూలో నిలబడి ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చిరంజీవి కుటుంబం నేరుగా బూత్ లోకి వెళ్ళడం సహించలేకపోయారు. ఫలితంగా ఓ కేంద్ర మంత్రి…