తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది. కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్…

అన్నా బృందం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం రద్దు?

మరి కొద్ది వారాల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్న అన్నా బృందం, తమ ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే, తనకేం కాలేదనీ, కొద్దిరోజుల్లో తాను ఆరోగ్యంగా బైటికి వస్తాననీ ఆసుపత్రి నుండి సందేశం పంపినప్పటికీ ఎన్నికల ప్రచారం విషయంలో అన్నా బృందం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ పాల్ విషయంలో కాంగ్రెస్ దేశాన్ని దారుణంగా మోసం చేసిందనీ కనుక ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న…

భారత రాయబారిపై చైనా వ్యాపారుల దాడి? ఏది నిజం?

  భారత రాయబారి ఎస్.బాలచంద్రన్ పైన చైనా వ్యాపారులు దాడి చేశారనడాన్ని షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారులు నిరాకరిస్తున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. కాని సంఘటనను వివరిస్తున్న భారత పత్రికల కధనాలు వేరే విధంగా ఉన్నాయి. దాడి జరిగిందని చెప్పలేనప్పటికీ, దాడిలాంటిది జరిగిందని మాత్రం అర్ధం అవుతోంది. ఇందుకు ప్రధానంగా చైనా వ్యాపారుల తొందరపాటుతనం కారణంగా కనిపిస్తోంది. తమకు ఇవ్వవలసిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నంలో వారు తొందరబాటుకి గురైనట్లు కనిపిస్తోంది. షాంఘై నగరం దగ్గర…

భారత రాయబారికి వైద్యం నిరాకరించడంపై విచారణకు చైనా అంగీకారం

తన రాయబారికి వైద్యం నిరాకరించడం విషయంలో భారత విదేశీ మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపడానికి చైనా అంగీకారం తెలిపింది. భారత వ్యాపారులను విచారిస్తున్న కోర్టు వద్ద హాజరైన రాయబారికి కోర్టులో ఉండగా వైద్య సౌకర్యం పొందడానికి అక్కడ ఉన్న చైనా అధికారులు నిరాకరించారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది. షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారి ఎస్.బాలచంద్రన్ డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘యివు’ పట్టణంలో అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న అనుమానంతో భారత…

అన్నా హజారే పై విమర్శలు, అవినీతి వ్యతిరేక ఉద్యమ విశ్లేషణ -1

అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంలో పోరాడుతున్నాడు. నిజానికి అన్నా హజారే పోరాడుతున్నాడు అనడం సమంజసం కాదు. అన్నా హజారే గానీ, ఆయన లాంటివారు గానీ వ్యక్తిగా తలపడి అవినీతి లాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక చెడుగు పై పోరాడడం సాధ్యమయ్యే పని కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా క్రెడిట్ అంతా ఆయన ప్రజలను కూడగట్టగలగడం లోనే ఉంది. అంటే అన్నా చరిత్ర, నిబద్ధత,…

‘మమత’ సవరణలతో లోక్ పాల్ బిల్లు బడ్జెట్ సమావేశాలకి వాయిదా పడే ప్రమాదం

రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. యు.పి.ఎ భాగస్వామి త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రతిపాదించిన సవరణలకు ప్రతిపక్ష పార్టీలలో కూడా మద్దతు దొరకడంతో ప్రస్తుత సమావేశాలలో లోక్ పాల్ బిల్లు ఆమోదం కష్టంగా కనిపిస్తోంది. బిల్లుకు తలపెట్టిన సవరణలతో సహా, లోక్ పాల్ బిల్లు, మరొకసారి స్ధాయీ సంఘం పరిశీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. చూడగా, ఎన్.డి.టి.వి విశ్లేషణ అంతిమంగా నిజమయ్యేలా పరిస్ధితి కనిపిస్తోంది. రాష్ట్రాలు…

యు.పి, ఉత్తర ఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాల ఎన్నికల తేదీల ప్రకటన

కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల తేదీలు ప్రకటించింది. తద్వారా మినీ సాధారణ ఎన్నికలకు తెరతీసింది. రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసింది. వ్యాహాలు, ప్రతి వ్యూహాలకు బదులుగా రాజకీయ పార్టీలు కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, స్నేహాలు, బంధుత్వాలు, శతృత్వాలు… ఇలా అందుబాటులో ఉన్నవాటన్నింటినీ ఉపయోగించుకునేందుకు ఇక సిద్ధం కానున్నాయి. రాష్ట్రం సీట్లు ఎన్ని విడతలు ఎప్పుడు? కౌంటింగ్   ఉత్తర ప్రదేశ్        403       7…

అమెరికాతో ఘర్షణ నేపధ్యంలో పాకిస్ధాన్ కి పూర్తి మద్దతు హామీ ఇచ్చిన చైనా

దక్షిణాసియాలో అమెరికాకు చిరకాల మిత్ర దేశంగా ఉన్న పాకిస్ధాన్ కి అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపధ్యంలో ఆ దేశానికి చైనా నుండి పూర్తి మద్దతు లభించింది. ఆర్ధిక, రక్షణ తదితర రంగాలన్నింటిలోనూ చైనా పాకిస్ధాన్ కి పూర్తి మద్దతుగా నిలుస్తుందని పాకిస్ధాన్ పర్యటిస్తున్న చైనా అత్యున్నత విదేశాంగ శాఖ అధికారి హామి ఇచ్చినట్లుగా ‘ఫస్ట్ పోస్ట్’ తెలిపింది. చైనా ప్రభుత్వ కౌన్సిలర్ దాయి బింగ్-గువో, తన పాక్ పర్యటన పాక్, చైనా సంబంధాలను మరింత ఉన్నత స్ధాయికి…

‘టీం అన్నా’ ఆందోళనను ను తూర్పారబట్టిన బోంబే హై కోర్టు

టీం అన్నా శుక్రవారం అనూహ్య రీతిలో బోంబే హై కోర్టు నుండి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది. తమ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమే అని గట్టిగా నమ్ముతున్న టీం అన్నా బృందానికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. “మీ ఆందోళన ప్రజా ప్రయోజనాల కోసమేనని కోర్టు నిర్ణయించలేదు. మీరు జరుపుతున్న ఆందోళన మీకు ‘సత్యగ్రహం’ కావచ్చు. ఇతరులకు అది ‘న్యూసెన్సు’ కావచ్చు” అని కోర్టు అన్నా బృందం వాదనలను తిరస్కరించింది. బోంబే హైకోర్టు వ్యాఖ్యలు అన్నా బృందానికి…

పాకిస్ధాన్ ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర -ప్రధాని గిలాని

దేశంలో ఏ సంస్ధ కూడా రాజ్యంలో మరొక రాజ్యంగా ఉండజాలదని పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ బుధవారం హెచ్చరించాడు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్ధాన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కుట్రలు జరుగుతున్నాయని గిలానీ ఆందోళన వ్యక్తం చేసాడు. పాక్ ప్రధాని గిలాని వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కొద్ది వారాల క్రితం అధ్యక్షుడు జర్దారీ, అమెరికా ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కి రాశాడని భావిస్తున్న మెమో లోని అంశాలను ధృవ పరచడం గమనార్హం. అమెరికా…

ఇరాక్ విధ్వంసంతో అమెరికా సంతృప్తి, అందుకే సైన్యం ఉపసంహరణ -కార్టూన్

దాదాపు ఎనిమిదేళ్ళకు పైగా ఇరాక్ లో అమెరికా సైన్యం తిష్ట వేసింది. ఒక దేశాన్ని, ఒక ప్రజా సమూహాన్ని ఎన్నిరకాలుగా విధ్వంసం చేయవచ్చో అన్ని రకాలుగానూ ఇరాక్ ను అది విధ్వంసం కావించింది. ప్రజల నిత్యజీవనానికి అవసరమైన మౌలిక నిర్మాణాలన్నింటినీ -రోడ్లు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సౌకర్యం, రైలు మార్గాలు, ఆయిల్ పైప్ లైన్లు, ఆయిల్ సరఫరా మార్గాలు మొ॥వి౦- సర్వనాశనం చేసింది. తాను స్ధాపిస్తానన్న ప్రజాస్వామ్యం ఊసుని పూర్తిగా విస్మరించింది. ప్రశాంతంగా బతుకుతున్న ఇరాకీయుల మధ్య, జాతి,…

ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ లపై ఛార్జి షీటు నమోదుకు ప్రభుత్వం అనుమతి

నవంబరు 26, 2008 తేదీనుండి మూడు రోజుల పాటు ముంబైలోని పలు ప్రదేశాల్లో టెర్రరిస్టులు దాడి చేసి పలువురిని చంపిన నేరానికి, ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ, రాణాలపైన ఛార్జీ షీటు నమోదు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్ధానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హేడ్లీ, పాకిస్ధానీ కెనడియన్ టెర్రరిస్టు తహవ్వూర్ రాణాలతో పాటు లష్కర్-ఎ-తొయిబా వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్ లు ఇండియాలో టెర్రరిస్టు దాడులకు పధకం పన్నినందుకు ఛార్జి షీటు నమోదు చేయడానికి జాతీయ…

‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారు -కార్టూన్

ఉత్తర కొరియా అధిపతి ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారని ఈ కార్టూనిస్టు చెబుతున్నాడు. కిమ్ జోంగ్-ఇల్ బతికి ఉన్నంత కాలం అంతర్జాతీయ రాజకీయాలలో చురుకుదనం పుట్టించాడనీ, తద్వారా రాజకీయ కార్టూనిస్టులకు కావలసినంత మేత దొరికిందనీ ఈ కార్టూనిస్టు అభిప్రాయం. అమెరికా, యూరప్ ల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ లొంగి ఉంటే ప్రపంచంలో పట్టించుకునేవారెవరూ పెద్దగా ఉండరు. అమెరికా మాట తు.చ తప్పకుండా వినే దేశాల పేర్లు కూడా చాలా మందికి తెలియదు. అదే అమెరికా పక్కలో…

‘క్షిపణి’ లో(తో)నే ‘కిమ్ జోంగ్-ఇల్’ సమాధి!!! కార్టూన్

కిమ్ జోంగ్-ఇల్ నేతృత్వంలో ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం సంపాదించి అణ్వస్త్రాల నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగించింది. ఉత్తర కొరియా వద్ద నిజానికి అణ్వస్త్రాలు ఉన్నదీ లేనిదీ అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఉత్తర కొరియా అనేకసార్లు అణ్వస్త్ర పరీక్ష జరపడంతో ఆ దేశం వద్ద అణు బాంబులు ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటాయి. ఇరాన్ లాగానే ఉత్తర కొరియాపైన కూడా అణ్వస్త్రాలను సాకుగా చూపుతూ అమెరికా, యూరప్ లు…