శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…

భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు…

బూతు మంత్రులే కాదు, డజను పైన బూతు ఎం.ఎల్.ఏ లు కూడా

కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం మాని, ముగ్గురు మంత్రులు బూతు వీడియోలు చూసి టెలివిజన్ కెమెరాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు మంత్రులే కాకుండా ఇంకా డజను కంటే ఎక్కువ మంది ఎమ్మేల్యేలు కూడా ఆ రోజు బూతు వీడియోలు చూసి తరించినట్లు అసెంబ్లీ కమిటీ పరిశోధనలో బైట పడినట్లు తెలుస్తోంది. మంత్రులు సవాది లక్ష్మణ్, సి.సి.పాటిల్, కృష్ణ పాలేమార్ లు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ…

నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…

అమెరికా, చైనా లు లేకుండా ప్రపంచ సమస్యల పరిష్కారం కుదరదు -హిల్లరీ

చైనాకు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న స్ధాయిని అమెరికా మరొకసారి బహిరంగంగా అంగీకరించింది. ప్రపంచ వ్యవహారాల్లో ప్రతి టేబుల్ వద్దా చైనాకు సీటు ఉందనీ, ప్రపంచ స్ధాయిలో ప్రాముఖ్యం కలిగిన ప్రతి సంస్ధలోనూ చైనాకు పాత్ర ఉందనీ, అమెరికా, చైనాలు లేకుండా ప్రపంచంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావడం అసంభవమనీ అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ చైనా సందర్శించి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా…

ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి

కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…

ఆడలేక ‘మద్దెల ఓడు’ అంటున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి సరైన అభ్యర్ధులను నిలబెట్టక పోవడమే కారణమని సోనియా గాంధీ చెపుతోంది. ఓటమి వల్ల యు.పి.ఏ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని విశ్వాసం వ్యక్తం చేసింది. యు.పి ఎన్నికల్లో పార్టీ బలహీనం కావడం వల్లే ఓట్లు పడలేదని తేల్చేసింది. ‘అధిక ధరలు’ పార్టీ అభ్యర్ధుల ఎన్నికల అవకాశాలను దెబ్బ తీసి ఉండవచ్చని కూడా ఆమె అంగీకరించింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయవలసి ఉందని…

2012 అసెంబ్లీ ఎన్నికలు: ఏ పార్టీనీ నమ్మని భారత ప్రజలు

భారత దేశ ప్రజలు తమ వద్దకు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ పార్టీనీ నమ్మని పరిస్ధితికి చేరుకున్నారని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఏదో ఒక పార్టీకి పట్టం కట్టినట్లు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఒకే సమయంలో దేశవ్యాపితంగా ఒకే పార్టీని నమ్మే పరిస్ధితి ఇక రాకపోవచ్చన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించడానికే పరిమితమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అంటే…

ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్

‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …

యు.పి ఎన్నికల్లో సైకిల్ హవా -కార్టూన్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు గల్లంతు కాగా ప్రతిపక్షం లో ఉన్న పార్టీలు అధికారం దిశలో పయనిస్తున్నాయి. మణి పూర్ పంజాబ్ లలో మాత్రం కాంగ్రెస్, బి.జె.పి కూటమి తిరిగి నిలబెట్టుకునే వైపుగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తగా చూస్తే యు.పి.ఏ, ఎన్.డి.ఏ రెండు కూటములకూ నిరాశ కలిగించేవిగానే ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. గాంధీల కంచుకోటలుగా భావించే అమేధీ, రాయబరేలలోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు వెనకబడి ఉన్నారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో అధికార బి.ఎస్.పి…

గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…

మమతకి గడ్డి పెట్టిన కోల్ కతా హై కోర్టు

తన ప్రభుత్వంలో జరుగుతున్న హత్యలకు 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనే కారణం అంటూ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ తన భాద్యతలను ఎలా తప్పించుకోగలదని కోల్ కతా హై కోర్టు తీవ్రంగా విమర్శించింది. సి.పి.ఐ(ఎం) పార్టీ నాయకులను చంపిన కేసులో పోస్టు మార్టం రిపోర్టు కూడా మృతుల బంధువులకు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. శుక్రవారం నాలుగు గంటల లోగా పోస్టు మార్టం రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్ల పాలన…

నక్సల్ జిల్లాల్లో పోలీసులకి రు.800 కోట్లు, ప్రజలకి రు.30 కోట్లు

దేశంలో నక్సల్ పీడిత జిల్లాలలో దుర్భేధ్యమైన కోటల్లాంటి పోలీసు స్టేషన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభ్యుత్వం రు.120 కోట్లు మేరకు విడుదల చేసింది. పోలీసు ఠాణాల నిర్మాణం కోసం విడుదల చేస్తున్న ఈ సొమ్ము కేవలం మొదటి వాయిదా మాత్రమే.  మరింత సొమ్ముని మరిన్ని వాయిదాలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నక్సల్ పీడిత జిల్లాలలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2010-11 లో కేవలం రు.25 కోట్లు మాత్రమే…

కొత్త పుంతలు తొక్కుతున్న ‘మమత’ ఫాసిస్టు పాలన

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ఫాసిస్టు పాలన కొత్త పుంతలు తొక్కుతోంది. భారత దేశంలోని పాలక వర్గ పార్టీలు నామ మాత్రంగా ఏర్పరుచుకున్న నియమాలను, సూత్రాలనూ సైతం ఉల్లంఘిస్తోంది. రేపిస్టులకూ, హంతకులకు మద్దతుగా రావడమే కాకుండా రైతుల ఆత్మహత్యలను బూటకంగా అభివర్ణిస్తూ ‘పచ్చి ప్రజా వ్యతిరేకి’ గా తనను తాను రుజువు చేసుకుంటోంది. మమత వ్యవహార సరళితో బెంగాల్ లోని వివిధ రంగాల మేధావులు తీవ్రంగా నిరసిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.…

World nuclear map

అణ్వాయుధాలు: అమెరికా ముందు తన ఇంటిని సరి దిద్దుకోవాలి

అణ్వాయుధాలను భద్రంగా కాపాడుకోవడంలోనూ, సమర్ధవంతమైన భద్రతా చర్యలను చేపట్టడంలోనూ ప్రపంచ దేశాలకు ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలైన ఇండియా, పాకిస్ధాన్, ఇరాన్ లాంటి దేశాలకు పాఠాలు చెప్పే అమెరికా ముందు తన వద్ద ఉన్న అణ్వాయుధాలు భద్రంగా లేని సంగతిని పట్టించుకోవాలని అమెరికా ప్రభుత్వ ఏజన్సీ నివేదిక తలంటింది. పాకిస్ధాన్ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ, భారత దేశానికి అణ్వాయుధాలు భద్రపరుచుకునే పరిజ్ఞానం లేదనీ, అణ్వాయుధాలే లేని ఇరాన్ అణ్వాయుధాల వల్ల ప్రపంచ భద్రతకే…